India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి గుంటూరు జిల్లా, మూల్పూరులో జన్మించారు. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు.1952 తెనాలిలో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు ఎం.ఎన్.రాయ్ ప్రారంభోపన్యాసాన్ని పంపారు.1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. వివేకానందపై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఆంధ్రప్రభ ఆందోళన చేసింది. వీరు సెప్టెంబర్ 6, 1966లో చనిపోయారు.

తెనాలికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ న్యాయశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 9 బంగారు పతకాలను సాధించాడు. విశాఖలోని లా యూనివర్సిటీలో జరిగిన 11వ స్నాతకోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దామోదరం సంజీవయ్య, నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ చేతుల మీదుగా శ్రీరామ్ పతకాలు అందుకున్నారు.

తురకపాలెం వరస మరణాలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తురకపాలెం మరణాలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయాని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాలు, చెరువులు, కాలువల నుంచి మట్టి తీయాలంటే వాటాలు, జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు ఆధారంగా సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చేబ్రోలు మండల పరిధిలోని శేకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పి.విజయలక్ష్మీ గుంటూరు జిల్లా ఉత్తమ హెచ్ఎంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం విజయలక్ష్మీని మండల విద్యాశాఖ అధికారి రాయల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పుర ప్రముఖులు అభినందించారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో రత్నాలు, ఆభరణాల పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకోసం మంగళగిరి మండలం ఆత్మకూరులో 76.01 ఎకరాల విస్తీర్ణంలో ‘మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్’ అమలుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం పిల్లలకు మరపురాని వేడుకగా నిలుస్తుంది. ఉదయం విద్యార్థులు స్వయంగా గురువుల వేషధారణలో స్కూల్ కి వచ్చి తరగతులను నిర్వహించేవారు. పాఠశాల ప్రాంగణం నవ్వులు, ఆటపాటలతో మార్మోగేది. బహుమతులు, శుభాకాంక్షలతో గురువులను సత్కరించడం విద్యార్ధులకు ఆనందం. ఈ వేడుకలు గురువు – శిష్య బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా COMMENT చేయండి.

‘అవధాని శిరోమణి’ బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసుడు, అనేక భాషలు నేర్చిన పండితుడు చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి కాశీ కృష్ణాచార్యులు (1872-1967. గుంటూరు హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. 1961లో ఏపీ ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు కొనసాగారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది.

గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.

గుంటూరు జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి.ఎన్.కిరణ్ కుమార్ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు పొన్నూరు మత్స్య కేంద్రంలో ఎఫ్డీఓ లాబ్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు జిల్లా మత్స్య శాఖ అధికారిగా బాధ్యతలు సేకరించారు. మత్స్య శాఖ అభివృద్ధికి తన వంతు సహాయ సహకరాలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.