Guntur

News August 3, 2024

నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకుని నాయకుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ మేరకు బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News August 3, 2024

కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 6,034 క్యూసెక్కులు విడుదల

image

కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 6,034 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 260, బ్యాంక్ కెనాల్ కు 1539, తూర్పు కెనాల్ కు 606, పశ్చిమ కెనాల్‌కు 189, నిజాంపట్నం కాలువకు 410, కొమ్మమూరు కాలువకు 2680 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు .

News August 2, 2024

మిస్ యూనివర్స్-ఇండియాకు ఎంపికైన యువతికి సీఎం అభినందన

image

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం (M), ఎం.కె.పురానికు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు.

News August 2, 2024

GVL ట్వీట్‌పై స్పందించిన నారా లోకేశ్

image

బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ట్వీట్‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. పోలీసులు మితిమీరి వ్యవహరించినందుకు లోకేశ్ క్షమాపణ చెప్పడం, విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం పట్ల GVL లోకేశ్‌ను అభినందించారు. దీనికి ప్రతిగా లోకేశ్ ‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేయడమే నా లక్ష్యం‘ అని ట్విట్ చేశారు.

News August 2, 2024

CRDA అథారిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో CRDA పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల పై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, మునిసిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News August 2, 2024

వెలగపూడి: విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

image

రైతాంగానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.

News August 2, 2024

వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

గుంటూరు జీడీసీసీ బ్యాంకు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్ కుమార్‌లకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఫిర్యాదు శుక్రవారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో బినామీ పేర్లతో రుణాలు ఇచ్చారని, ఆనాటి పాలకవర్గంపై కేసు నమోదు చేయాలన్నారు. నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారన్నారు. 

News August 2, 2024

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురి అరెస్ట్

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి ఘటనలో మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు కొత్తపేటకు చెందిన బుజ్జిబాబు, ఆదిత్య నగర్‌కు చెందిన సత్యనారాయణ, గుజ్జనగుండ్ల చెందిన మణికంఠను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేశామన్నారు. 

News August 2, 2024

ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్ల రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల(07781), 5 నుంచి 12వ వరకు మాచర్ల-విజయవాడ(07782) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి-విజయవాడ-కాజీపేట మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు గుంటూరు-పగిడి పల్లి మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయన్నారు.

News August 2, 2024

మంగళగిరిలో అగ్నిప్రమాదం.. ఆస్తి నష్టం

image

మంగళగిరి పరిధి గణపతి నగరంలోని మొదటిలో నాగేంద్రం అనే వ్యక్తి అద్దెకి నివసిస్తూ విజయవాడలో బంగారం పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజు మాదిరిగా గురువారం పనికి వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంటిలోని ఏసీ గ్యాస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఆయన నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వస్తువులు మొత్తం దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.18 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.