India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1942 ఆగస్టు 12 న తెనాలి పట్టణంలో క్విట్ ఇండియా ఉద్యమంలో వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు ప్రజలు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు.
★ మాజేటి సుబ్బారావు
★ శిరిగిరి లింగయ్య
★ తమ్మినేని సుబ్బారెడ్డి
★ గాలి రామకోటయ్య
★ ప్రయాగ రాఘవయ్య
★ జాస్తి అప్పయ్య
★ భాస్కరుని లక్ష్మీనారాయణ
వీరి జ్ఞాపకార్థమే మన తెనాలి రణరంగ చౌక్.

గుంటూరులో మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో రాజకీయాలు కూడా అంతే హాట్గా ఉంటాయి. అలాంటి జిల్లాకు అందులోనూ అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రూలింగ్ పార్టీ పగ్గాలు చేతులు మారబోతున్నాయని తెలిసి భారీగా ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. రాజధాని జిల్లా కావడంతో నేతలు తీవ్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. అధ్యక్ష పదవీ ఎవరికి ఇస్తారనేది తెలుగు తమ్ముళ్లలో చర్చ నడుస్తోంది.

గాదె చిన్నపరెడ్డి @ సైరా చిన్నపరెడ్డి.. తెనాలి డివిజన్ చేబ్రోలు సమీప కొత్తరెడ్డిపాలెం స్వస్థలం. రెడ్డి రాజుల పరాక్రమాన్ని పుణికి పుచ్చుకున్న స్వాతంత్రోద్యమకారుడు. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన 1909 కోటప్పకొండ దొమ్మీ ఆయన సాహసానికి ప్రతీక. వందేమాతరం నినాదంతో స్ఫూర్తిని పొంది, ఉద్యమానికి ఊపిరిలూదిన చిన్నపరెడ్డిపై గాయకులు, కథకులు ఎన్నో గేయాలు రాశారు. చివరికి బ్రిటిష్ పాలకుల కక్షకు ఉరికొయ్యన ఊయలలూగాడు.

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రేపు నగరానికి రానున్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెడ్క్రాస్ నిర్వహిస్తున్న “ఏపీ క్లైమెట్ యాక్షన్ క్యాంపెయిన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం విజ్ఞాన మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గుంటూరులోని NTR స్టేడియం పాలకవర్గ ఎన్నికలు ఆగస్టు 18న జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడటంతో TDP కార్యకర్తల్లో అసహనం పెరిగిందని చర్చ స్థానికంగా నడుస్తోంది. టీడీపీ నేతలు వర్గాలుగా చీలిపోయి పదవులకు నామినేషన్లు వేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దీనిపై ఎంపీ పెమ్మసాని నగర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి ఆరోపించారు. పెదవడ్లపూడిలో బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ చేసిన అభివృద్ధిని కూటమి తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్తో కూడిన చికెన్ రూ.190, స్కిన్ లెస్ రూ.210గా ఉంది. మటన్ ధర రూ.950కి చేరింది. చేపల్లో రాగండి రూ.180, బొచ్చ రూ.220, కొరమీను రూ.450గా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

గుంటూరు నగరంలోని 70 ఏళ్ల పురాతన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. 1958 ఆగస్టు 4న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయగా.. 70 ఏళ్లుగా గుంటూరు నగరంలో ఈ ఐకానిక్ ఫ్లైఓవర్ నగర చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఈ వంతెన కూల్చివేత గుంటూరు నగరవాసులకు ఒక భావోద్వేగ అంశం. ఎందుకంటే, చాలా మందికి ఇది జ్ఞాపకాలతో ముడిపడి ఉంది.

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. స్టాల్స్ ఏర్పాటు, ప్రజలు కూర్చునేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఏఎస్పీ హనుమంతు, వెస్ట్ డీఎస్పీ అరవింద్, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలు, తదితరులు ఉన్నారు.

పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని నెమలి పించములతో ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Sorry, no posts matched your criteria.