Guntur

News January 7, 2025

లోకేశ్ సమక్షంలో సుజ్లాన్-ఏపీఎస్ఎస్డీసీ అవగాహన ఒప్పందం

image

ఏపిలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇస్తారు.

News January 7, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు DMHO

image

చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

News January 7, 2025

గుంటూరు: అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

image

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేశాడని చుండూరు (M) మున్నంగివారిపాలెంకు చెందిన శ్రీనివాసరావు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయశాఖలో అటెండర్‌గా పనిచేసే ఎన్.సునీల్ తన బావమరిది ద్వారా పరిచయమయ్యాడన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడన్నారు. ఉద్యోగం రాలేదని, డబ్బులడుగుతుంటే బెదిరిస్తున్నాడని సోమవారం గ్రీవెన్స్‌లో వాపోయాడు.

News January 7, 2025

GNT: జిల్లాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.?

image

స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

News January 7, 2025

వృద్దులు, మహిళలకు ఫిర్యాదులపై శ్రద్ధ: ఎస్పీ 

image

వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

News January 6, 2025

8న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు: DEO

image

గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్‌లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు. 

News January 6, 2025

గుంటూరు: 11 మందికి కారుణ్య నియామకాలు

image

కారుణ్య నియామకంలో భాగంగా వివిధ పోస్టులకు జిల్లాలో 11 మంది ఎంపికయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ నాగలక్ష్మీ అందించారు. ఇద్దరికి జైళ్ల శాఖ, ఇద్దరికి గ్రౌండ్ వాటర్, ఇద్దరికి పోలీస్ శాఖ, ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలలో జేఓఏలుగా నియమించారు. ఉద్యోగాలు పొందిన వారు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.

News January 6, 2025

అర్జీలు పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలతో పాటు రెవెన్యూ సదస్సులలో అందిన అర్జీలు కూడా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్లో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 183 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. 

News January 6, 2025

GNT: కుష్టు వ్యాధి అవగాహణ పోస్టర్ల ఆవిష్కరణ

image

సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. 

News January 5, 2025

పొన్నూరు: ముంచేసిన Instagram పరిచయం

image

పొన్నూరుకు చెందిన ఆళ్ళ రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్‌స్ట్రాగ్రాంతో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.