India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లిదండ్రులను కన్నకొడుకు హత్య చేసిన సంఘటన బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయభాస్కరరావు, సాయి కుమారి అనే దంపతులు అప్పికట్లలో గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఆస్తుల పంపకంలో విభేదాల గురించి సంబంధించి వీరి కుమారుడు కిరణ్ వారిని దారుణంగా హత్య చేశాడన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. పోలీసులు హత్య జరిగిన ఇంటి వద్ద పహారా కాశారు.
సినీ హీరో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
పిడుగురాళ్ల మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నూర్జిత్ కుమార్ (20) కుటుంబ సభ్యులతో పిడుగురాళ్ల మండలం కామేపల్లికి వరి మిషన్తో పాటు వచ్చారు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఓ యువతిని ప్రేమించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ప్రేమ విఫలం కావడంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జీజీజీహెచ్ లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు <<14859523>>తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే<<>>. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీప్రసాద్(28) బండి కొనిపెట్టలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ విధానంలో డాక్టర్లు తాళాలను బయటకు తీశారు
అమరావతి: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.
గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను గురువారం వైఎస్ జగన్ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కలిశారు. అరెస్టు జరిగిన విధానాన్ని విని అక్రమ అరెస్టును ఖండిస్తున్నానని, అతనికి కావలసిన న్యాయసహాయాన్ని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నగర మేయర్ మనోహర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35) గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
భార్యపై అనుమానంతో సుత్తితో దాడి చేసిన విషయమై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పసుమర్రు గ్రామానికి చెందిన నాగరాజు అతని భార్య ఆదిలక్ష్మీపై ఈ నెల 10న సుత్తితో తల, ముఖంపై దాడిచేశాడు. బాధితురాలి కుమారుడు గంజి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై జి.అనిల్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లి వద్ద కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. వైకుంఠపురం బ్యారేజీ-10 టీఎంసీలు, చోడవరం బ్యారేజీ-4 టీఎంసీలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవి అమరావతి ప్రాంతంలో తాగునీరు&పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడతాయని, అలాగే రివర్ ఫ్రంట్ను రూపొందించడంలో కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.