Guntur

News January 3, 2025

మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు

image

మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. UPHC ఇందిరా నగర్ నుంచి AIIMS మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం PAP స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. AIIMS సిబ్బందిని, అధికారులను అభినందించారు.

News January 3, 2025

చిలకలూరిపేటలో గొంతు కోసి దారుణ హత్య

image

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సుభాని నగర్‌కు చెందిన పాలపర్తి నాగరాజును(50) గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆయనకు ఒక బాబు, పాప ఉన్నారు. డైక్ మెన్ కాలనీకి చెందిన ఆకుల చెన్నయ్య తానే హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య సంఘటన జరిగినట్లు చెబుతున్నారు.

News January 3, 2025

గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే: జగన్

image

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘X’లో ట్వీట్ చేశారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

News January 3, 2025

పేరలి గ్రామ సర్పంచిపై అనర్హత వేటు

image

కర్లపాలెం(M) పేరలి పంచాయతీ సర్పంచ్‌ మల్లెలవెంకటేశ్వర్లుపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ప్రిన్సిపల్ గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఆదేశాలిచ్చింది. పేరలి సర్పంచి ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర్లు నామినేషన్ ఫారంలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని, ఆయన ఎన్నిక చెల్లదని వీరయ్య అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని, సర్పంచ్ పదవికి అనర్హుడని తీర్పునిచ్చింది.

News January 3, 2025

GNT: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 3, 2025

బోరుగడ్డ అనిల్ బెయిల్ ఫిటిషన్ కొట్టివేత

image

బోరుగడ్డ అనిల్‌ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే బోరుగడ్డ పనిగా పెట్టుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. అతణ్ని మరికొంతకాలం జైల్లోనే ఉండనీయండని ఆదేశించింది. అలాంటి వారిపై కనికరం చూపించడానికి వీల్లేదంటూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో బోరుగడ్డ అరెస్టైన సంగతి తెలిసిందే.

News January 3, 2025

నరసరావుపేట ఈ నెల 10లోగా ఫీజు చెల్లించాలి-DEO

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మార్చి2025 టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 10లోగా ఫీజు చెల్లించాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. ఏపీ ఆన్‌లైన్‌లో గాని నేరుగా గాని చెల్లించాలన్నారు. ఆలస్యం అయితే ఈనెల 8వ తేదీలోపు రూ.25లు, 9వ తేదీలోపు రూ.50లు, 10వ తేదీలోపు తత్కాల్ రుసుంతో ఫీజు చెల్లించాలన్నారు .

News January 3, 2025

GNT: నేటి నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

image

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్థులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.

News January 2, 2025

గుంటూరు: కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలలో 166 మంది అర్హత

image

పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News January 2, 2025

తాడేపల్లి: అధికారంలోకి రాగానే సక్రమం అయిపోయిందా : YCP

image

సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టపై ఉన్న అక్రమ నివాసం సక్రమం అయిపోయిందా అని YCP తన ‘X’లో పోస్ట్ చేసింది. లింగమనేని రమేష్ నుంచి ఆ ఇంటిని అక్రమ మార్గాల్లో చంద్రబాబు తీసుకున్నారని.. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు మొన్నటి వరకు ఆయన కుటుంబం బుకాయించిందని రాసుకొచ్చారు. కరకట్టపై ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకటించారని గుర్తు చేశారు.