India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్తో ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని నేడు కలిసిన సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.
రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లూరు మండలం సగ్గునలంకలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సగ్గునలంకకు చెందిన మణికంఠ ట్రాక్టర్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వారు ఒప్పుకోకపోవడంతో 20వ తేదీన మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
చిలకలూరిపేట: వైసీపీ ఆధ్వర్యంలోఈ నెల 27న నిర్వహించబోయే పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రి విడదల రజిని బుధవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. యూనిట్కి రూపాయన్నర పెంచారన్నారు. రూ.15,485 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మాజీ మంత్రి విమర్శించారు.
నకరికల్లులో బుధవారం జరిగిన<<14980399>> రోడ్డు ప్రమాదంలో<<>> చీమలమర్రికి చెందిన తోక కొండయ్య (56)మృతి చెందారు. మృతుడు తన భార్యతో రోడ్డు దాటుతుండగా పిడుగురాళ్ల వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఓ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నియంత్రణ తప్పి కొండయ్య, ఆయన భార్యను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలు కాగా నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొండయ్య మృతి చెందగా అతని భార్య చికిత్స పొందుతున్నారు.
చిలకలూరిపేట: వైయస్సార్సీపి ఆధ్వర్యంలోఈ నెల 27 నిర్వహించబోయే పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రి విడుదల రజిని బుధవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. యూనిట్కి రూపాయన్నర పెంచారన్నారు. రూ.15,485 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మాజీ మంత్రి విమర్శించారు.
నరసరావుపేట మండలం ఉప్పలపాడు-పెట్లూరివారిపాలెం మధ్య ఉన్న రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది, గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
గుంటూరులో వ్యభిచార గృహం నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు మహిళలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాష్ నగర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి, మహిళలతో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.