Guntur

News February 3, 2026

GNT: ‘హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేయాలి’

image

జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థాలను వేరుచేసేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో మంగళవారం జిల్లా NGT కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను ఇంటి నుంచి సేకరించటంతో పాటు, పర్యావరణానికి హాని లేకుండా నూరుశాతం సక్రమంగా నిర్వహించాలన్నారు. మురుగునీటిని పూర్తిగా శుద్ధిచేయాలన్నారు.

News February 3, 2026

GNT: 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం ఈయనే

image

తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రవర్తి గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. ఆయన 1971 నుంచి 1989 వరకు సంగీత రంగాన్ని ఏలారు. 959 సినిమాలకు సంగీతం, దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ ఇచ్చారు. 1989లో విడుదలైన 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం అందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2002 ఫిబ్రవరి 3న ఆయన కన్నుమూశారు.

News February 3, 2026

డాక్టర్ ఉమా గవిని.. మహిళా వైద్యులకు నిజమైన నిర్వచనం

image

నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా నిరతికి ప్రతీకగా నిలిచిన వారిలో గుంటూరుకు చెందిన NRI డాక్టర్ ఉమా గవిని ఒకరు. అమెరికాలో అలర్జీ–ఇమ్యునాలజీ నిపుణురాలిగా పనిచేసిన ఆమె, జీవితకాల సంపాదన రూ.20 కోట్లను GGHలో మాతా–శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి విరాళం ఇచ్చారు.తన పేరు పెట్టవద్దని కోరడం ఆమె మహత్తర మానవత్వానికి నిదర్శనం.మహిళా వైద్యులు చరిత్ర సృష్టిస్తూ ఈ రోజున ఆమె ఎందరికో స్పూర్తి దాయకం.

News February 3, 2026

గుంటూరు: ఎస్పీ PGRSలో 170 ఫిర్యాదులు

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 170 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించి, ఫిర్యాది దారులకు సమాచారం అందించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా PGRS కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.