Guntur

News December 25, 2024

గుంటూరు: వస్తువుల కొనుగోలులో వినియోగదారులు అప్రమత్తం

image

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.‌ మనిషి పుట్టుకతోనే వినియోగదారుని జీవితం మొదలవుతుందని అన్నారు‌. ప్రతి ఒక్కరు తాము కొనే వస్తువు నాణ్యత కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తమకు ఎలాంటి మోసం జరిగిందని గ్రహించిన వెంటనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News December 24, 2024

బెనిఫిట్ షోలపై వ్యాఖ్యల్ని ఖండించిన ఆళ్ల హరి

image

బెనిఫిట్ షోలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల్ని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హరి ఖండించారు. మంగళవారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. తెలంగాణాలోని ఒక ధియేటర్‌లో జరిగిన దురదృష్టకర దుర్ఘటనను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు సినీ పరిశ్రమ మొత్తంపై కత్తి కట్టడం దుర్మార్గమన్నారు. అధికారం అండతో సినీ జగత్తు ఆధిపత్యం చెలాయించాలని చూడటం తగదని అన్నారు.

News December 24, 2024

BREAKING: బొల్లాపల్లి: కాలువలో దూకిన జంట

image

బొల్లాపల్లి మండలంలో జంట సాగర్ కెనాల్‌లో దూకడం సంచలనంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్‌లో మంగళవారం ఓ జంట దూకారు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలో దూకిన వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మహిళను రక్షించారు. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 24, 2024

క్రోసూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌డెడ్

image

క్రోసూరు మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామ సమీపంలో సత్తెనపల్లి నుంచి వస్తున్న కారు ద్విచక్రదారుడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వాహనదారుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2024

మున్సిపల్ స్కూల్లో చదివి బీఎస్ఎఫ్ జవాన్

image

తెనాలి ఐతాన‌గ‌ర్‌కు చెందిన ఎ. మ‌హాల‌క్ష్మి సాధార‌ణ పేద కుటుంబంలో జ‌న్మించింది. మున్సిప‌ల్ హైస్కూల్లో చదువుకున్న ఆమె బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించింది. క‌ఠోర శ్ర‌మ‌కు తోడు క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నించి ఆర్మీలో ఉద్యోగం సాధించింది. తొలి సారిగా స్వస్థలం తెనాలి వచ్చిన క్రమంలో ఆమె చదివిన ఐతాన‌గ‌ర్‌లోని ఎన్ఎస్ఎం హైస్కూల్‌లో ఉపాధ్యాయులు సోమవారం మ‌హాల‌క్ష్మిని ఘ‌నంగా స‌త్క‌రించారు.

News December 23, 2024

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. సీఆర్డీఏ, బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపింది. 

News December 23, 2024

నేడు అమరావతిపై CRDA కీలక సమావేశం

image

అమరావతి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం 44వ CRDA కీలక సమావేశం జరగనుంది. జోన్ 7, జోన్ 10, మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే రూ.45,249 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మరో 2వేల కోట్లకు పైబడి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలియజేయనుంది.

News December 23, 2024

వైసీపీలో కనిపించని సుచరిత ఆచూకీ 

image

ఎన్నికల అనంతరం మాజీ హోం మంత్రి సుచరిత ఆచూకీ కనిపించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన తాడికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి డైమండ్ బాబుకు అప్పగించారు. అప్పటి నుంచి సుచరిత పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆమె పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. కానీ పార్టీ మారేది లేదని అనారోగ్య కారణాల వల్ల సుచరిత దూరంగా ఉంటున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. 

News December 23, 2024

27లోపు అభ్యంతరాలు చెప్పొచ్చు: గుంటూరు DEO

image

గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్కూల్ కాంప్లెక్స్ సముదాయాల వివరాల ఉత్తర్వులు, జాబితాను ఉప, మండల విద్యాశాఖ అధికారులు తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక సూచించారు. దీనిపై అభ్యంతరాలను 27వ తేదీ లోపు జిల్లా, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించవచ్చని చెప్పారు. https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 23 నుంచి కూడా అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

News December 22, 2024

GNT: కాకులు వాలని కొండ ఎక్కడ ఉందో తెలుసా.? 

image

కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపైకి కాకులు వచ్చిన దాఖలాలు లేవు. ఇది నరసరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రభలతో భక్తులు దర్శించుకుంటారు.