Guntur

News May 29, 2024

బాపట్ల: గల్లంతైన యువకుల వివరాల గుర్తింపు

image

బాపట్ల మండలం యార <<13337176>>కాలువలో గల్లంతైన<<>> వారు హైదరాబాద్ కూకట్‌పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఉదయం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో గడిపి తిరుగు ప్రయాణంలో యార కాలువ నందు ఈతకు దిగి గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు కాలువలో దిగగా సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

News May 29, 2024

బాపట్ల: నలుగురు యువకులు గల్లంతు

image

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.

News May 29, 2024

జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్ 

image

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.

News May 29, 2024

గుంటూరు: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.

News May 29, 2024

గుంటూరు: గురుకులాల ఉపాధ్యాయుల సేవల పునరుద్ధరణ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న 2023-24 విద్యా ఏడాది చివరి పనిదినం కావడంతో ఆరోజు వారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను కొనసాగిస్తూ విధుల్లోకి తీసుకోవాలని జిల్లా సమన్వయకర్త, ప్రిన్సిపాల్స్‌ని ఆదేశించారు.

News May 29, 2024

తెనాలి యువకుడు హైదరాబాద్‌లో దుర్మరణం

image

తెనాలి గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ బేగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను తన సోదరుడితో పాటు ఆదిభట్ల ప్రాంతంలో రూములో ఉంటున్నాడు. సోమవారం ఉదయం వీళ్లిద్దరితో పాటు మరో యువకుడు బైకు మీద ఉద్యోగాలకు బయల్దేరారు. ఈ క్రమంలో మీర్‌పేట్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో హుస్సేన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు ఇస్మాయిల్ కోమాలోకి వెళ్లాడు.

News May 28, 2024

గుంటూరు: ఫలితాలు వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ కంట్రోల్ యూనిట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల సీరియల్ నంబర్ వారీగా ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు బాధ్యతగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని స్పష్టం చేశారు.

News May 28, 2024

మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కేకు బెయిల్.. కండిషన్లు ఇవే.!

image

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రతిరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది.

News May 28, 2024

కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా

image

ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ రోజు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ రావు, ఎస్పీ మలికా గర్గ్, జేసీ శ్యాంప్రసాద్, డీఆర్వో వినాయకం, తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

image

పాలిటెక్నిక్ కాలేజిల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్- 2024లో అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజి, నరసరావుపేట JNTUలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 1-12వేల ర్యాంకుల వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంబీటీఎస్ హెల్ప్ లైన్ సెంటర్లో 65 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.