India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొన్నూరు మండలం మనవ గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 9వేల టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. తేమ శాతం 17% మించి ఉన్నా కొంటామన్నారు. పొన్నూరు ప్రాంతంలో అదనంగా 7రైస్ మిల్లుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు.
10వ తరగతి పరీక్షా హాల్ టికెట్లలో తప్పులను ఈనెల 19 నుంచి 23వరకు సరిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇటీవల ఆన్లైన్లో చేసిన 10వ తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్లో ఉంటే సరిచేసుకోవాలని విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలన్నారు.
గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ బుధవారం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భూమి సమస్యలు, పట్టాల పంపిణీ, రైతుల అభ్యర్థనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సు ద్వారా ప్రభుత్వ సేవల చేరువపై దృష్టి సారించారు.
గుంటూరులో మంగళవారం స్నేహితుల వివాదంలో ఒకరి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. తెనాలికి చెందిన దీపక్(25), GNTకు చెందిన కిరణ్ స్నేహితులు. గతంలో కిరణ్ వద్ద దీపక్ రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది. మంగళవారం కిరణ్ పార్టీ ఇస్తున్నానని చెప్పి దీపక్ను పిలిచాడు. కిరణ్ అతని స్నేహితులు దీపక్ను కొట్టి చంపారు. కాగా గతంలో దీపక్ అన్న హత్యకు గురికావడం గమనార్హం.
స్వల్పవివాదం గాలి వానలా మారి మాజీ ఎమ్మెల్యే కూతురు, గుంటూరుకు చెందిన ఐపీఎస్ వరుడి వివాహం నిలిచింది. తెలంగాణా మాజీ ఎమ్మెల్యే కూతురితో నగరానికి చెందిన గుజరాత్ క్యాడర్ IPS అధికారికి మంగళవారం డాన్ బాస్కోలో వివాహం జరగాల్సి ఉంది. మండపం వద్దకు కాంగ్రెస్ జెండాలతో ర్యాలీగా వెళ్లాలని వధువు బంధువులు కోరడంతో వరుడి బంధువులు నిరాకరించారు. వారి మధ్య మాటలు పెరిగి వివాహం నిలిచింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం అక్రమ రవాణాపై గతంలోగా 6A చట్టాన్ని వాడి వదిలేయమని, పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. మచిలీపట్నంలోని జేఎస్ గోడౌన్లో భారీగా స్టాక్ షార్టేజ్ గమనించడం జరిగిందన్నారు. దీనిపై డీటెయిల్ ఎంక్వయిరీ జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. మంగళవారం నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో తన గోడును వెళ్లబోసుకున్నారు. ఎంపీకి డీఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తెలియజేయాలన్నారు.
మంగళగిరిలో అనంత జిల్లాకు చెందిన రైతు DY.CMను కలిసేంత వరకు కదలనని భీష్మించుకున్న విషయం తెలిసిందే. నవీన్ హిందూపురం నుంచి ఎడ్లబండిపై నెలరోజులు ప్రయాణించి సోమవారం మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వేడుకోలుకు స్పందించిన పవన్ కళ్యాణ్ రైతుతో మాట్లాడారు. దళారుల బెడద తప్పించాలని, పండించిన ఉత్పత్తులను అమ్ముకోలేక పోతున్నామని రైతు వాపోయాడు. దీంతో సమస్యను విన్న పవన్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. కార్యక్రమంలో పలు విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి 49మంది ఎంబీబీఎస్, నలుగురు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు.
Sorry, no posts matched your criteria.