Guntur

News May 25, 2024

పచ్చటి పల్నాడు పల్లెల్లో రాజకీయ కార్చిచ్చు

image

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు. 

News May 25, 2024

అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించాలి: గుంటూరు కలెక్టర్

image

పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌పై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ హాల్‌లో సంబంధిత టేబుల్ వరకు అనుమతిస్తామని చెప్పారు. సెల్‌ఫోన్లు అనుమతించరని, పేపర్, పెన్ను తీసుకొని వెళ్ళవచ్చన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపుపై పార్లమెంట్ అభ్యర్థులతో శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు.

News May 24, 2024

లోకేశ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్.. మీ COMMENT.!

image

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

News May 24, 2024

మాచర్ల: విద్యుత్ షాక్‌‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మాచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన ముక్కాల శ్రీను (58) పొలంలో ట్రాక్టర్‌తో మందు పిచికారి చేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీనుకు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 24, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.

News May 24, 2024

నెల్లూరు జైలుకు పల్నాడు పెట్రోల్ బాంబుల నిందితులు

image

పోలింగ్ రోజు దాచేపల్లి మండలం తంగెడలో జరిగిన పెట్రోల్ బాంబుల దాడి ఘటనలో నిందితులను నెల్లూరు, గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీకి చెందిన 22 మందిని, TDPకి చెందిన 11 మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా 14 రోజులు రిమాండ్ విధించారు. రెండు వర్గాలలో ఒక వర్గం వారిని నెల్లూరు జిల్లా జైలుకు, మరో వర్గం వారిని గుంటూరు జిల్లా జైలుకు పంపారు.

News May 24, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.

News May 24, 2024

EVM ధ్వంసం ఘటనలో పలువురు సస్పెండ్.. వివరాలివే..!

image

రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టిన విషయంలో అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీకేశ్ తెలిపారు. GJC జూనియర్ కాలేజ్, సత్తెనపల్లిలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేసే PV సుబ్బారావు (ప్రిసైడింగ్ ఆఫీసర్), వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ షహనాజ్ బేగం (పోలింగ్ ఆఫీసర్ /అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్)ను విధుల నుంచి తొలగించామన్నారు.

News May 24, 2024

జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదు: బాపట్ల ఎస్పీ

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులలో కేవలం వాహనాలలో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పోయవద్దని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

News May 23, 2024

గుంటూరు: టెన్త్ పరీక్షలకు 27 ఎగ్జామ్ సెంటర్లు

image

గుంటూరు జిల్లాలో రేపటి నుంచి జూన్ 3 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,373 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంటెంట్లు, శాఖాధికారులు సహా 280 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ అధికారులు నియమించారు.