Guntur

News October 25, 2024

గుంటూరులో రేపు జాబ్ మేళా

image

గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రమాదేవి తెలిపారు. CREDRIGHT FINANCE, SBI CREDIT CARDS, DAIKIN, SMART KIDS కంపెనీలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ చదివిన 18-35 సంవత్సరాల వారు అర్హులని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుందని, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని చెప్పారు. Shareit

News October 25, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ ఎంపీ నందిగం సురేశ్ వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ వాదనలకు సమయం కోరడంతో ఈ నెల 28కి విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే తుళ్ళూరు పోలీసులు నందిగం సురేశ్‌‌ను కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.

News October 24, 2024

వాసిరెడ్డి పద్మ రాజకీయ పయనమెటు.?

image

AP మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ YCPకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాజీనామా చేసిన సమయంలో ఆమె ఆ పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అటు ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ పయనంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఆమె జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలో చేరతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 24, 2024

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు: మంత్రి సవిత

image

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్ లో వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

News October 24, 2024

తెనాలి: సహానా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

image

దాడి ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన తెనాలి, ఐతా నగర్ కు చెందిన యువతి సహానా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిందని మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News October 23, 2024

నా పేరు చెప్పి మోసం చేస్తున్నారు: మంత్రి లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో కొందరు అక్రమ వసూళ్లు చేస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘నా పేరు, ఫొటో వాడుకుని ఎన్నారై టీడీపీ అనే ఫేక్ ఐడీతో మోసాలు చేస్తున్న మోస‌గాళ్లను బ్లాక్ చేయాలని సూచించారు. నారా లోకేశ్ టీం సభ్యులు సమస్యకు సంబంధించిన వివరాలు మాత్రమే అడుగుతారని, డబ్బులు అడగరని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

గుంటూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు 

image

తుఫాను కారణంగా గుంటూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23న సికింద్రాబాద్-భువనేశ్వర్(17016), సిల్చార్-సికింద్రాబాద్(12514), సికింద్రాబాద్-హౌరా(12704), యశ్వంత్ పూర్-హౌరా(12864) రద్దు చేశారు. అలాగే 24న హౌరా-సికింద్రాబాద్(12703), శాలిమార్-వాస్కో(18047), సికింద్రాబాద్-మాల్దా(03429), 25న భువనేశ్వర్-సికింద్రాబాద్(17015), భువనేశ్వర్-బెంగుళూరు(18463)రద్దు చేశారు. 

News October 23, 2024

రెడ్డిపాలెం: పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

image

గుంటూరు శివారు రెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని మృతిపట్ల యాజమాన్యం అనేక రకమైన కారణాలు చెప్తోందని బాధిత కుటుంబం ఆరోపించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News October 23, 2024

దీపావళి బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: గుంటూరు ఎస్పీ

image

రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లు, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో మాట్లాడారు. బాణాసంచా తయారీ, విక్రయాలు చేసే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.