Guntur

News January 23, 2026

ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

image

రాబోయే మూడేళ్ల‌లో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వ‌ర‌కు త‌గ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తెలిపారు. విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని అన్నారు. నాణ్య‌మైన విద్యుత్ త‌క్కువ ధ‌ర‌ల‌కు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

News January 23, 2026

RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

News January 23, 2026

నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.

News January 23, 2026

గుంటూరు జిల్లాలో భారీ మోసం

image

నల్లపాడు GDCC బ్యాంకులో రూ.30కోట్ల పైగా ఆర్థిక మోసానికి పాల్పడిన 2 కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఛైర్మన్, ఉద్యోగులు, కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్, మిర్చి వ్యాపారులు, నకిలీ రైతులు మొత్తం 270మంది నిందితులుగా గుర్తించామని అన్నారు. బ్యాంక్ మేనేజర్ అరుణకుమారి, కమిటీ సభ్యుడు గోవింద్, మిర్చి వ్యాపారి రామచంద్రరావు, కోల్డ్ స్టోరేజ్ నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అరెస్టయ్యారు.

News January 23, 2026

గుంటూరు: ‘వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో UPHCలు, PHCలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారములు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.in‌లో అందుబాటులో ఉన్నాయి.

News January 23, 2026

పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

image

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.

News January 22, 2026

పాన్ ఇండియా ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: కలెక్టర్

image

బాలకార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా ఈ నెల 26 నుంచి మార్చి 31వరకు పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నీ శాఖలు సమష్టిగా కృషి చేయాలని, బాల్య వివాహాలు అరికట్టాలని స్పష్టం చేశారు.