India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినందుకు మంత్రి లోకేశ్ యాజమాన్య కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు ఈ డిజిటల్ ఇన్విటేషన్లు ఓ ఉదాహరణ. అని ట్వీట్ చేశారు. లక్షలాది మంది పూర్వ విద్యార్థులతో పండుగ వాతావరణంలో Mega PTM జరుపుదామని చెప్పారు.
గుంటూరు లక్ష్మీపురంలోని ఓ స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ జరుగుతున్న ఉదంతాన్ని చూసి పొలీసులే కంగుతిన్నారు. ఈ క్రమంలో సెంటర్ లోపల ఉన్న పలువురు యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువగా యువతులు ఉండటం గమనార్హం.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు ప్రాధమిక హక్కులు లభించాయని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు.
తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలు తీయటంతో వారి పరిచయం పెళ్లిగా మారింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీశ్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 1981 డిసెంబరు 26న 46 సంవత్సరాల వయసులో మరణించింది.
మహానటి సావిత్రి మన తాడేపల్లి మం. చిర్రావూరులో డిసెంబర్ 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. నేడు ఆమె జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోగా.. పెదనాన్న వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. ఆమె చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగి.. 250కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు.
అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటీవల దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులోని ఓ పాతబడిన రెస్టారెంట్ వద్డ దెయ్యాలు కనిపించాయంటూ.. వారం రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళ బయట తిరగడానికి భయపడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను కోరుతున్నారు.
ANUలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం.. పెదకాకాణిలోని నంబూరు విజయభాస్కర్ నగర్కు చెందిన యువతి ANUలో ఇంజినీరింగ్ చదువుతోంది. పృథ్వీ ఆ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆతనికి నగదు, లాప్ట్యాప్ ఇచ్చినట్లు పేర్కొంది. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు.
అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాటకాలు ఆడిన వైసీపీ అధినేత జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దమౌతున్నట్లు ప్రకటించారని, దీని ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.