India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 30న ఉయ్యూరు AG&SG సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు నైపుణ్య అభివృద్ధి అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజ్యూమ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.
బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుంటే, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు ప్రకటించాయి. కానీ అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం బ్రిడ్జ్ కోర్సుల పేరుతో విద్యార్థులపై హాజరు ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి మిడ్డే వరకు మండే ఎండలో తరగతులు సాగుతున్నాయి. ఇరు వైపుల ఒత్తిడితో విద్యార్థులు విసుగెత్తిపోతుండగా, తల్లిదండ్రులు అధికారుల జోక్యం కోరుతున్నారు.
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడు రోజులు క్రితం బాధ్యతలు స్వీకరించిన గోపిని శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని కలిసిన కలెక్టర్ మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు భేటీ అయి జిల్లాలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, న్యాయ అంశాలపై చర్చించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్ప్రెస్లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.
Sorry, no posts matched your criteria.