India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు అయింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై వాదనాలు పూర్తి అయ్యాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టు తీర్పు వెలువరించనుంది.
కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయ సంస్థలకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్ఛార్జ్లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రవి కుమార్ పాల్గొన్నారు.
విధి నిర్వహణలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు భార్య వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. ఆమెను జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS)గా నియమితులైన శేషు కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా DCHSగా పనిచేస్తున్న శేషు కుమార్ ఇటీవల జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.
మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
నాగాయలంక పీఏసీఎస్లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.