Krishna

News August 26, 2024

కృష్ణా: B.Tech విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన B.Tech 4, 6వ సెమిస్టర్ పరీక్షలకు (2023-24) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సెప్టెంబర్ 5లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News August 26, 2024

కృష్ణా: బిరియాని ఇప్పించలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు

image

విజయవాడలో బిరియాని ఒకరి ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిరియాని అడిగాడు. రాము బిరియాని ఇప్పించలేదని తమ్ముడు కిటికీ చెక్కతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

ఎన్టీఆర్: తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి

image

విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగచరణ్ ఆడుకుంటుండగా తేలు కుట్టింది. విషయాన్ని బాలుడు ఇంట్లో ఆలస్యంగా చెప్పాడు. దీంతో ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News August 26, 2024

గుడ్లవల్లేరు: పుల్లేరు కాలువలో పడి బాలుడు మృతి

image

గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి. వివరాల్లోకి వెళితే స్థానిక నీలకంఠేశ్వరపురానికి చెందిన జోషి(17) తన ఇంటికి సమీపంలోని పుల్లేరులో స్నానానికి దిగి లోపలికి వెళ్లి పడిపోయాడు. ఏపీ ఎస్‌డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించాయి. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News August 26, 2024

కృష్ణా ష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

image

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే అన్నారు.

News August 26, 2024

విజయవాడ: ఎంపాక్స్ కోసం ప్రత్యేకంగా 6 వార్డులు

image

మంకీ పాక్స్ కేసులు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో 6 పడకలతో అత్యాధునిక వైద్యం పరికరాలతో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ ఉన్నత అధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాకులో వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్ వెల్లడించారు. వదంతులను నమ్మవద్దని ఒకవేళ ఆ వ్యాధి వ్యాప్తి చెందితే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

News August 25, 2024

విజయవాడ: వేతనాలు చెల్లించాలని మంత్రికి వినతి

image

విజయవాడ జనసేన కేంద్ర కార్యాలయంలో వాలంటీర్స్ గౌరవ వేతనం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయూన్ భాష ఆదివారం సాయంత్రం వినతి పత్రం ఇచ్చారు. అనంతరం భాష మాట్లాడుతూ.. వాలంటీర్లకి చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. జాబ్ చాట్ ను విడుదల చేసి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.

News August 25, 2024

విజయవాడలో ఎంపాక్స్.. ఖండించిన DMHO

image

విజయవాడలో ఎంపాక్స్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుహాసిని స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరికి ఎంపాక్స్ లక్షణాలు గుర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయవాడ ప్రభుత్వ పీడియాట్రిక్స్ హెచ్వోడీ అనిల్ కుమార్ సైతం పేర్కొన్నారు.

News August 25, 2024

TDP నేతల వేధింపులు: వైసీపీ మహిళా కార్యకర్త

image

TDP సోషల్ మీడియా వారు తనను వేధిస్తున్నారని YCP స్పోక్స్ పర్సన్ సుచిత్ర విజయవాడ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. YCP సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నానని.. TDP సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారన్నారు. TDP సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని తెలిపారు. అంతేకాకుండా తనను రేప్ చేస్తానని బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

News August 25, 2024

అనుములంకలో కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి

image

గంపలగూడెం మండలం అనుములంక గ్రామానికి చెందిన కృష్ణ (62) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. మృతిచెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు, కాగా మృతుడు గత కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల వ్యాధి తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాగా చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి మృతిచెందాడన్నారు.