India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు 3 వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వైసీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ తెలియజేశారు.
ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
చదువు కోసం వచ్చిన ఓ విద్యార్థిని వేదనకు గురైంది. గుడ్లవల్లేరు డైట్ కాలేజీలో డిప్యూటేషన్పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హరి కిరణ్ ఆమెను 20 రోజులుగా వేధిస్తున్నాడని, అసభ్య సందేశాలు, ఫోన్ కాల్స్తో ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి హరికిరణ్ను సస్పెండ్ చేశారు. అతనిపై పోలీసు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్రప్రసాద్, వంశీ తరఫున డాక్టర్ దేశీ సత్య శ్రీ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి హిమబిందు తీర్పును మార్చి 28కి రిజర్వ్ చేశారు.
కృష్ణా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. గురువారం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. నందివాడ 40.7°, బాపులపాడు 41.5°, గన్నవరం 42.4°, కంకిపాడు 41.2°, పమిడిముక్కల 40.2°, పెనమలూరు 41.6°, ఉంగుటూరు 42.2°, పెదపారుపూడి 41.1°, తోట్లవల్లూరు 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.
ఇనుగుదురుపేట వర్రిగూడెంలో ఈ నెల 21న సంచలనం సృష్టించిన టోపీ శీను హత్య కేసును మచిలీపట్నం పోలీసులు ఛేదించారు. బుధవారం ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్లో బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇల్లీగల్ కేసుకు సంబంధించి హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కడవకొల్లు దయాకర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కేరళలోని బైబిల్ కళాశాల యువకులు బుధవారం కృష్ణాజిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిజోరం రాష్ట్రం యువకుడు చోచో, తమిళనాడు యువకులు శివబాలన్, అడ్రెల్లా, కాకినాడ యువకుడు శామ్యూల్ గ్రామాన్ని సందర్శించారు. చల్లపల్లి పాస్టర్ దైవసేకుడు గోల్కొండ డేవిడ్ సూచన మేరకు గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన రహదారుల పక్కన పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు.
కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలలో మోటార్ల వద్ద విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి 216 మోటార్లు, 7 ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి సుమారు రూ.4.50 లక్షల విలువైన, 2400 మీటర్ల పొడవు, 300 కేజీల బరువున్న రాగి వైర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో హాస్పిటల్లో జాయిన్ అయినా కొడాలి నానికి అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యం సవ్యంగా ఉన్నట్లు రిపోర్ట్లు వచ్చాయని చెప్పారు. ఆయనకు గుండెపోటు అని మీడియాలో వస్తున్న కథనాలు ఆవాస్తమని ఆయన ఖండించారు.
Sorry, no posts matched your criteria.