India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని రూపొందించనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, సీఐఐల సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం శుభసూచకమన్నారు.
విజయవాడలో కృష్ణానది వారధిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ తారక రామారావుని లారీ ఢీకొట్టింది. దీంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువూరు మండలం ముష్టకుంట్ల పడమటి వాగులో రైతు వరద నీటిలో గల్లంతైయ్యాడు. మంగళవారం రైతు అరిసేపల్లి వేణు(45) పశువులను మేపేందుకు వెళ్లాడు. ఇంటికొస్తుండగా పడమటి వాగు వరద నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది పడమటి వాగు పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బయలు పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు బెయిల్ పొడగిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో ఆయన ఏ72గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేశారు. వల్లభనేని వంశీకి కాస్త ఊరట లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్చిలోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు అవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కంకిపాడులో గృహ నిర్మాణ సామగ్రి, నిల్వ గోదాంను ఆయన సందర్శించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, అతిసార కేసుల వివరాలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల DMHOలు ఎం.సుహాసినీ, జి.గీతాబాయి వివరించారు. జూన్, జులై నెలల్లో మలేరియా, డెంగీ- 300,టైఫాయిడ్-800+, అతిసారం కేసులు 208 నమోదయ్యాయన్నారు. విషజ్వరాలు నిర్ధారించిన ప్రాంతాల్లో 50 మీటర్ల పరిధిలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. కుటుంబీకుల వివరాల మేరకు గంపలగూడెంలోని పెనుగొలనుకు చెందిన వెంకటేశ్వరరావు(26) సోమవారం పొలం దున్నేందుకు వెళ్లాడు. వర్షం పడడంతో చెట్టుకిందికి వెళ్లాడు. ఆసమయంలో పిడుగుపడి మృతి చెందాడు. అలాగే దొడ్డదేవర పాడులో వెంకటరమణ(17) పొలంలో పనులు చేస్తుండాగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దన్నే ఆనందరాజుకు ఏడేళ్లు జైలు, జరిమానా పడింది. విజయవాడలోని న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఆనందరాజు.. భర్తతో వేరైన ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. తల్లి ఇంట్లో లేనప్పుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మందలించినా తీరు మారకపోవడంతో 2018లో అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు జైలు, రూ.10 వేలు జరిమానా విధించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. విజయవాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో నెల కిందట వంద రూపాయలకే 5 కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటే రూ.60 పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల వ్యవధిలోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు.
* గుడివాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత
* కృష్ణా జిల్లాలో కొత్త రేషన్ కార్డులు
* విజయవాడలో ఇంటర్ విద్యార్థి సూసైడ్
* కృష్ణా జిల్లాలో డాక్టర్పై పేషెంట్ దాడి
* మచిలీపట్నంలోని ఇంట్లో చోరీ
* తిరువూరులో బాలికపై అత్యాచారం
* కృష్ణా: అన్న క్యాంటీన్కు రూ.కోటి విరాళం
Sorry, no posts matched your criteria.