India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. మట్టి విగ్రహాలే వాడాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని, DJలు, బాణసంచా, శబ్ద కాలుష్యం, రోడ్ల ఆక్రమణలు నిషేధమని హెచ్చరించారు.
మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ డీకే బాలాజీ పి-4 పథకం అమలుపై బుధవారం సమీక్షించారు. ఉన్నత వర్గాల ప్రజలను మార్గదర్శిలుగా స్వచ్ఛందంగా చేరేలా చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. 48,375 కుటుంబాలు 4,272 మార్గదర్శులతో అనుసంధానం అయినట్లు తెలిపారు. పేదలను ఆర్థికంగా, విద్యలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.
ధాన్యం సేకరణపై కలెక్టర్ డీకే బాలాజీ జేసీ గీతాంజలి శర్మతో కలిసి బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. నవంబర్ మొదటి వారంలో వరి పంట చేతికి రానున్నందున రైతు సేవా కేంద్రాలు, మిల్లర్లు, గోనె సంచులు, రవాణా వాహనాలు, ఎఫ్సీఐ గోదాములు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
హనుమాన్ జంక్షన్ పోలీసులను ఒక ప్రేమ జంట ఆశ్రయించింది. తాము గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, సోమవారం విజయవాడలోని గుణదల చర్చిలో కులాంతర వివాహం చేసుకున్నామని షేక్ హసీనా (21), ఏడుకొండలు (23) తెలిపారు. వీరిద్దరూ మడిచర్లకి చెందినవారు. తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపీఎస్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, అవసరమైతే కేసులు నమోదు చేసి సహాయం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
జిల్లాలో SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో ఆయన SP ఆర్ గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టం (1955), SC, ST అట్రాసిటీ నివారణ చట్టం (1989), మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాలపై అధికారులు చర్చించారు.
మచిలీపట్నం కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ హాల్లో ‘మీ-కోసం’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో త్వరలోనే 43 బారులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు గెజిట్ నోటిఫికేషన్కు సిద్ధమవుతున్నారని ఎక్సైజ్ అధికారి గంగాధర్ రావు తెలిపారు. ఈ బార్లలో నలుగురిని గీత కార్మికుల కోటా కింద కేటాయించగా, మిగతా బారులు ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి. ఓపెన్ క్యాటగిరీలో బార్ల కోసం దరఖాస్తుల సమర్పణకు ఈనెల 26వ తేదీ చివరి రోజు కాగా, గీత కార్మికుల కోటా దరఖాస్తులకు 29వ తేదీ వరకు గడువు ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ నాగమణి సోమవారం తెలిపారు. కృష్ణా జిల్లాలో రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, 3 రోజుల పాటు గేట్లను మూసివేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, బీచ్వైపు రావద్దని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.