Krishna

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో టాపర్‌గా కృష్ణా జిల్లా

image

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 90 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 21,669 మంది పరీక్షలు రాయగా 19,952 మంది పాసయ్యారు. 92 శాతం పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే 1వ స్థానంలో నిలిచింది.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో టాపర్‌గా కృష్ణా జిల్లా

image

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 90 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 21,669 మంది పరీక్షలు రాయగా 19,952 మంది పాసయ్యారు. 92 శాతం పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే 1వ స్థానంలో నిలిచింది.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో టాపర్‌గా కృష్ణా జిల్లా

image

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 90 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 21,669 మంది పరీక్షలు రాయగా 19,952 మంది పాసయ్యారు. 92 శాతం పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే 1వ స్థానంలో నిలిచింది.

News April 14, 2026

కృష్ణా: రేపే ఫలితాలు.. 49,579 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రథమ సంవత్సరం 24,173, ద్వితీయ సంవత్సరం 25,406 మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 14, 2026

కృష్ణా: రేపే ఫలితాలు.. 49,579 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రథమ సంవత్సరం 24,173, ద్వితీయ సంవత్సరం 25,406 మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 14, 2026

MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

image

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 14, 2026

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని ఫైర్ స్టేషన్‌లో మంగళవారం ఆయన అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణకు వాడే వివిధ పరికరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News April 14, 2026

కృష్ణా: అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ?

image

మచిలీపట్నం కోర్టు రోడ్డులోని అంబేడ్కర్ భవన్ శిథిలావస్థకు చేరినప్పటికీ, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. గతంలో రూ.5కోట్ల నిధులతో నిర్మిస్తామని హామీలు ఇచ్చినా, రాజకీయ వైషమ్యాల వల్ల అది సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. అటు MP బాలశౌరి, ఇటు మంత్రి కోళ్లు రవీంద్ర మధ్య సఖ్యత లేకపోవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.