Krishna

News April 7, 2026

కృష్ణా: పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

image

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.

News April 6, 2026

కృష్ణా: తమీమ్ అన్సారియాను కలిసిన ఎస్జీఎఫ్ఐ

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను సోమవారం ఎస్జీఎఫ్ఐ ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి భానుమూర్తి రాజుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యదర్శులు రాంబాబు, శిరీషలు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో పాఠశాల స్థాయి క్రీడల అభివృద్ధికి, పోటీల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని వారు కమిషనర్‌ను కోరారు.

News April 3, 2026

చల్లపల్లి: అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అభినందనీయం

image

అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం అభినందనీయం అని డీఆర్ఓ సీసీ వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో ఇటీవల అగ్నిప్రమాదంలో కర్రా లక్ష్మయ్య పూరిల్లు కాలిపోయింది. వారికి శుక్రవారం రెడ్ క్రాస్ చల్లపల్లి ఛైర్మన్ లీలాబ్రహ్మేంద్ర స్టీల్ సామాన్లు, నిత్యావసర సరుకులు, టార్పాలిన్, రగ్గు, జిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ ద్వారా రూ.5వేలు ఆర్థిక సహాయం అందచేశారు.

News April 3, 2026

కృష్ణా : సర్పంచ్‌ల పాలనకు సెలవ్..!

image

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.

News April 2, 2026

కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

image

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 1, 2026

కృష్ణా జిల్లాలో మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువ ఎంతంటే..!

image

కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువలో(-2%) తిరోగమనం కనిపించింది. గత 12 నెలల్లో రూ.1,064.95 కోట్ల విలువైన 14.84 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 6.75 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 13.89 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 3.99 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,083.23 కోట్లుగా నమోదైంది.

News April 1, 2026

మచిలీపట్నంలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

image

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని 7, 9 డివిజన్‌లలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెన్షన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన కలెక్టర్ పెన్షన్ దారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.

News April 1, 2026

కృష్ణా: జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News April 1, 2026

కృష్ణా: జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News April 1, 2026

కృష్ణా: జన్మనిస్తూ ఏ తల్లీ మరణించకూడదు: కలెక్టర్

image

జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మాతా, శిశు మరణాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ముగ్గురు తల్లుల మరణాలపై శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్లు, బాధితుల బంధువులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జన్మనిస్తూ ఏ తల్లీ మరణించరాదన్నారు.