Krishna

News August 18, 2025

కృష్ణా: హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత

image

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ నాగమణి సోమవారం తెలిపారు. కృష్ణా జిల్లాలో రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, 3 రోజుల పాటు గేట్లను మూసివేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, బీచ్‌వైపు రావద్దని ఆమె కోరారు.

News August 18, 2025

కృష్ణా: పంట పొలాల్లో వీడని ముంపు.. రైతుల ఆందోళన

image

వర్షాలు తగ్గి ఆరు రోజులు గడిచినా, వాయుగుండం ప్రభావంతో వరి పొలాల నుంచి నీరు బయటకు పోవడం లేదు. సముద్రం ఎగతన్నడంతో డ్రెయిన్లలో మురుగు నీరు దిగువకు ప్రవహించే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరి దుబ్బులు కుళ్లిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముంపునకు గల కారణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News August 18, 2025

కృష్ణా: ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల సంతోషం

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడూరు, అవనిగడ్డ మధ్య నిత్యం ప్రయాణించే మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఈ పథకం వల్ల నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇస్తున్నారని చెప్పారు. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఊరట కలిగిస్తుందని వారు అంటున్నారు.

News August 18, 2025

కృష్ణమ్మ ఉధృతి.. అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రభావిత గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు.

News August 17, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞ ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద
☞ కృష్ణాజిల్లాలో డెంగీ ఆందోళన
☞ తేలప్రోలులో ఆటోను ఢీకొన్న కారు
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తులు రద్దీ
☞ ఉచిత బస్సుల గుర్తింపునకు ప్రత్యేక స్టిక్కర్లు

News August 17, 2025

కృష్ణా: ఆధునిక యుగంలోనూ తావీజ్ ప్రభావం

image

ఆధునిక వైద్యం, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రజలలో కొన్ని పాతకాలపు నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తావీజ్ కేంద్రాలు. తావీజ్ ధరించడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, లేదా అనేది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ ఇది ప్రజల్లో ఒక రకమైన మానసిక బలం, ధైర్యం ఇస్తుందనేది వాస్తవం. అందుకే ఇప్పటికీ గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా తావీజ్ ధరించేవారి సంఖ్య తగ్గడం లేదు. మీ కామెంట్.

News August 17, 2025

కృష్ణా జిల్లాలో డెంగీ ఆందోళన

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా డెంగీ జ్వరం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా నీరసించి, ఏం జరిగిందో తెలియని అయోమయంలో పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రక్త కణాలు వేగంగా తగ్గిపోవడం, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల తీవ్రమైన స్థితిలో ఉన్నవారు విజయవాడ వంటి పెద్ద నగరాల ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కోసం వెళ్తున్నారు.

News August 17, 2025

కృష్ణా: ఉచిత బస్సుల గుర్తింపునకు ప్రత్యేక స్టిక్కర్లు

image

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఉన్న గందరగోళాన్ని నివారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు. ఉచిత ప్రయాణాన్ని అందించే బస్సులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు బస్సుల రంగులు, వాటిపై ఉన్న స్టిక్కర్లను గమనించి బస్సు ఎక్కాలని అధికారులు సూచించారు.

News August 17, 2025

గుడివాడ అభివృద్ధికి సహకరించాలని లోకేశ్‌కి వినతి

image

గుడివాడ అభివృద్ధికి సహకరించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. శనివారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో రాము మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ బస్టాండ్, డోకిపర్రు, పోలుకొండ, కంకిపాడు, మోటూరు రహదారుల అభివృద్ధి వినతులను లోకేశ్‌కు అందజేశారు. ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

News August 15, 2025

నేడు ఎగిరే జాతీయ జెండాను రూపొందించింది మన జిల్లా వాసే

image

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన జిల్లా వాసే. మహాత్మా గాంధీ సమకాలికుడైన పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్నే 1921 మార్చి 31-ఏప్రిల్ 1న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకంగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. గాంధీ సూచన మేరకు పతాకంలో రాట్నం గుర్తు, స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ సూచన మేరకు అశోకచక్రం చేర్చారు. కృష్ణా (D) మెువ్వ (M) బట్లపెనమర్రుకు చెందిన వెంకయ్య మన జిల్లా వాసి కావడం గర్వకారణం.