Krishna

News October 3, 2025

కృష్ణా: 11,316 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రేపే నగదు

image

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా కృష్ణా జిల్లాలో 11,316 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. ఒకొక్క లబ్ధిదారునికి రూ.15వేలు చొప్పున రూ.16 కోట్ల 97లక్షల 40 వేలు బ్యాంక్ ఖాతాల్లో శనివారం జమ కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వగా కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తుండటం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 3, 2025

9న అండర్ 19 కృష్ణా జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9న కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో అండర్-19 హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.

News October 3, 2025

7న గుడివాడలో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 7న గుడివాడ NTR స్టేడియంలో అండర్-19 అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. అథ్లెటిక్స్ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, అలాగే పాఠశాల HM సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకుని రావాలన్నారు.

News October 3, 2025

మచిలీపట్నం: పట్టణ సర్వే-నక్షపై కలెక్టర్ సమీక్ష

image

పట్టణ భూసంబంధ రికార్డుల సర్వే ద్వారా పట్టణ ప్రణాళికను బలోపేతం చేసేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పట్టణ సర్వే-నక్ష కార్యక్రమంపై జేసీ నవీన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతులను అనుసరించి భూ సర్వే చేసి, సంబంధిత రికార్డులను సజావుగా రూపొందించాలని అధికారులకు సూచించారు.

News September 29, 2025

‘మీ సమస్య ఏదైనా ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

image

మచిలీపట్నంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 38 ఫిర్యాదులు స్వీకరించారు. SP విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో అడిషనల్ SP V.V నాయుడు ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుడివాడకు చెందిన వనజ కుటుంబ వేధింపులు, అవనిగడ్డకు చెందిన కిషోర్ ఉద్యోగ మోసం, తోట్లవల్లూరుకు చెందిన వృద్ధుడు నరసయ్య ఆస్తి కోసం తన కుమారులు వేధింపులు, తదితర ఫిర్యాదులు అందాయన్నారు.

News September 28, 2025

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌‌ను సందర్శించిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.

News September 27, 2025

మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు పంపిణీ

image

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.

News September 27, 2025

ఈ పంట నమోదలో ఆలస్యం వద్దు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ఈ-పంట నమోదు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 27, 2025

కృష్ణాజిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. ఫేక్ జర్నలిస్టుల మోసాలకు చెక్

image

జర్నలిజం ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఆటకట్టించేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్లు కలిగి ఉన్న జర్నలిస్టులకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడే వారి ఆటకట్టించేందుకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

News September 27, 2025

మచిలీపట్నం: ‘సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

image

జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో సమావేశమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CM చర్చించిన అంశాలపై సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు.