India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.
నందమూరులోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడారు. డిజిటల్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.
మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు గురువారం పరేడ్ రిహార్సల్స్ను పరిశీలించారు. అతిథులు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వాటర్ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించాలని చెప్పారు. డీజేలు, బాణసంచా నిషేధమని పేర్కొన్నారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయకూడదని వివరించారు. అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద CC కెమెరాలు, శాంతి-సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లాలో అధిక వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మంత్రి అనితకు వివరించారు. 62 దుర్బల గ్రామాలు, 16 లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. బోట్లు, రవాణా సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బుధవారం అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.
ప్రకాశం బ్యారేజ్లో వరద ఉద్ధృతి పెరుగుతోందని, సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని, తొలి స్థాయి హెచ్చరిక ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. బుడమేరు నదికి 5,000-10,000 క్యూసెక్కుల వరద వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండి, కాల్వల పటిష్టత చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రయాణ అవసరాన్ని బట్టి మహిళలు తగిన బస్సులను ఎంచుకోవచ్చు. జిల్లాలు దాటి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ బస్సులు, జిల్లా సరిహద్దుల వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సేవలను ఉపయోగించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిటీ లిమిట్స్ దాటి వెళ్లాలంటే మెట్రో ఎక్స్ప్రెస్, నగరంలో ప్రయాణానికి ఆర్డినరీ సర్వీసులు ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా మోత్కూరు గ్రామంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు మూడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాలియా ప్రసాద్ కంకిపాడు జిల్లా కార్యాలయం నుంచి క్రీడాకారులను అభినందించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని ఆయన అన్నారు.
మచిలీపట్నంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (NDD) రెండో దశ ప్రారంభమైంది. చిలకలపూడి పాండురంగ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 99 శాతం మందికి మాత్రలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. ప్రేమ్ చందు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.