Kurnool

News April 11, 2025

కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు

image

కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడని ఇటీవల ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన కడప ఆర్జేడీ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీంతో తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

News April 11, 2025

రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. కర్నూలు జిల్లాలో 45,325 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 69 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు.  ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు. 

News April 11, 2025

కర్నూలు జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి కర్నూలు నగరంలో వాతావరణ మారింది. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి.

News April 11, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤మంత్రాలయం: 25 జంటలకు తాలిబొట్లు, కాళ్ల మెట్టలు అందజేత ➤ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం➤ అతివేగం.. మహిళ ప్రాణం తీసింది➤ శిరువెళ్ల హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్➤ కర్నూలు జిల్లాలో ఎస్ఐల బదిలీ➤ వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!➤ హనుమాన్ శోభాయాత్రకి మంత్రి టీజీ భరత్ ఆహ్వానం➤ ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో సబ్ కలెక్టర్ సమావేశం.

News April 10, 2025

సి.బెలగల్: ‘రీ సర్వేలో లోపాలు లేకుండా ఉండాలి’ 

image

పైలెట్ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వేలో లోపాలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రీసర్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన సి.బెలగల్ మండల కేంద్రంలోని గ్రామ పొలాల్లో జరుగుతున్న రీ సర్వే పని తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

News April 10, 2025

కర్నూలు జిల్లాలో ఎస్‌ఐల బదిలీ

image

కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక మహిళా ఎస్‌ఐ, ముగ్గురు ఆర్పీఎస్‌ఐలు, 14 మంది ఎస్‌ఐలు ఉన్నారు. వీఆర్‌లో ఉన్న ఐదుగురికి పోస్టింగులు దక్కాయి. తాజా బదిలీల్లో ఐదుగురు వీఆర్‌కు బదిలీ అయ్యారు. మొత్తంగా 18 మంది ఎస్‌ఐలు బదిలీ జాబితాలో ఉన్నారు.

News April 10, 2025

వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!

image

వెల్దుర్తిలో తహశీల్దార్ కార్యాలయంలో వింత ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కృష్ణ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అధికారులు నీకు ఎస్సీ కుల ధ్రువీకరణ నమోదు జాబితాలో లేదని చెప్పారన్నారు. చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఉందని, కానీ ఈ సం,, కుల ధ్రువీకరణ పత్రం తొలగించారని వాపోయారు. ఈ తప్పిదంతో ఎస్సీ కార్పొరేషన్ కోల్పోతానని వెల్లడించాడు.

News April 10, 2025

నేడు కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

News April 10, 2025

కర్నూలుతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హౌసింగ్, పిజిఆర్ఎస్, పీఆర్ వన్ యాప్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రీసర్వే, ఐవిఆర్ఎస్ వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు పరిశీలించి, అధికారులకు నిబంధనలు, ఆదేశాలు జారీ చేశారు.