Kurnool

News April 12, 2026

కర్నూలులో 3.1 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

image

కర్నూలు టౌన్ బళ్లారి చౌరస్తా సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు దాడి చేసి 3.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సహా కొనుగోలు, పంపిణీకి వచ్చిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులు అరకు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

image

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

image

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

image

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

image

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం.. యువతి మృతి

image

ఆదోని–సిరుగుప్ప రహదారిలోని లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా, మరో ఇద్దరు యువతులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్వీ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2026

ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

image

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

News April 10, 2026

చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

image

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.

News April 9, 2026

పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

News April 9, 2026

పాత వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు: ఎస్పీ

image

పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని హెచ్చరించారు. వాహనం కొనుగోలు ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వివరాలు RTA వెబ్‌సైట్‌లో చెక్ చేయాలని సూచించారు. చాసిస్, ఇంజిన్ నంబర్లు ఆర్సీతో సరిపోల్చాలన్నారు. విక్రేత అసలు యజమానా, కాదో నిర్ధారించుకోవాలన్నారు.