India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, అధికార యంత్రాంగానికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి ప్రతిమను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో విఘ్నాలు తొలగిపోయి, విజయాల సిద్ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. కాగా పోలీసుల అనుమతులకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు ఎస్పీ సూచించారు.
బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు జరుగుతున్న రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15వ తేది నాటికి పూర్తి చేయాలని NH-340C పీడీని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమయాజులపల్లె నుంచి డోన్ రూట్కు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు.
నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 93 పరిశ్రమల యూనిట్లకు రూ.8.43 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేశారు.
నందికొట్కూరులోని మారుతీ నగర్కు చెందిన శాలు బీ(45) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామాంజీ నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివారికి కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్, కుటుంబ సభ్యులు శుక్రవారం బంగారు పుష్పాలను విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 19 గ్రాముల బరువు ఉన్న 108 బంగారు పుష్పాలను అందించినట్లు చెప్పారు. బంగారు పుష్పాలను అందించిన దాతలను ఆలయ పండితులు, అర్చకులు స్వామి అమ్మవారి శేష వస్త్రాలతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
ఏపీలో 41 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ జాబితాలో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు నేతలకు చోటు దక్కింది. బేస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా టీ.అనిల్ కుమార్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వై.రుద్ర గౌడ్ నియమితులయ్యారు.
కర్నూలులో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భరత్.. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. కర్నూలులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని, అత్యుత్తమమైన కోచ్లను నియమించాలని కోరారు.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం సహాయ నిధికి సిండికేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ రిజ్వాన బేగం, ప్రభాకర్, తదితరులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషాకు చెక్కు అందజేశారు. అలాగే ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంకు తరఫున DCO రామాంజనేయులు రూ.5 లక్షల చెక్కును కలెక్టర్కు అందజేశారు.
YCP నంద్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి నియమితులయ్యారు. YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యధిక సార్లు MLAగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ నారాయణమ్మ కొనసాగారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.