India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
➤ టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్➤ అశేష జనవాహిని నడుమ సిద్ధరుఢ స్వామి రథోత్సవం➤మంత్రాలయం శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి➤ రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక➤ ఎమ్మెల్యేపై వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఫైర్➤ దేవనకొండ: తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ ఐపీఎస్ విరాళం➤ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్
మంత్రి నారా లోకేశ్ రేపు మంత్రాలయం రానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆయన వస్తుండటంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంగణం, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాంగణాన్ని ఎస్పీ పరిశీలించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
కర్నూలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.
అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోయిల్ అంటే గుడి అని ఆళ్వార్ అంటే భక్తుడని తెలిపారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గుడిని శుద్ధి చేసే ప్రక్రియ అన్నారు. ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి దర్శనం ఉండదని తెలిపారు.
కర్నూలులోని కోడుమూరు రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీ.బెళగల్(M) పోలకల్కు చెందిన మహేంద్ర(30) మృతిచెందాడు. భార్య, కూతురితో కలిసి మహేంద్ర రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. భార్య ఊరికెళ్లడంతో మిత్రుడు లింగంతో కలిసి బైక్పై బళ్లారి చౌరస్తాకు వచ్చాడు. ఓ హోటల్లో టిఫిన్ చేసి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తన స్నేహితుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
శివరాత్రి వేళ శ్రీశైలంలో విషాద ఘటన జరిగింది. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇరువురూ మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.