India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లాలో మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే యజమానులకు శిక్ష తప్పదని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. తన ఛాంబర్లో ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని ఆకాంక్షించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్ IAS అధికారి సి.విష్ణు చరణ్ కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత కలెక్టరేట్ చేరుకున్న నూతన జేసీ విష్ణు చరణ్కు డీఆర్ఓ పద్మజ స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని JC తెలిపారు.
నంద్యాలలో కరెంట్ షాక్తో న్యాయవాది శివరాం మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. నంద్యాలలో న్యాయవాదిగా ఉన్న శివరాం బుధవారం స్నానం చేసేందుకు వాటర్ హీటర్ వేస్తుండగా కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదోని అరుణ్ జ్యోతినగర్కు చెందిన ఇంతియాజ్ ఆలీ అనే వ్యక్తి తనకు దేవుడు చెప్పాడని మంగళవారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద తన కుడి చేతిని పెట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని ఎస్సై గోపాల్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నిఫా వైరస్ పట్ల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాట్లాడుతూ..ఐడీ వార్డు బ్లాక్లో 6 పడకలతో గదిని సిద్ధం చేసి నిఫా వైరస్ రోగులకు కేటాయించినట్లు తెలిపారు. దానికి నోడల్ అధికారిగా డా.విద్యాసాగర్ను నియమించినట్లు తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు, పీపీఈ కిట్లు, ఎన్ఐవీ మాస్కులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేసిన నీరు ఆంధ్రలోని ఎల్ఎల్సి 250 కెఎం వద్దకు మంగళవారం వచ్చాయి. ఎల్ఎల్సి ఈఈ కాలేశ్వర్, డిఈ సైఫుల్లా, ఏఈ రంగస్వామి హనవాళ్లు వద్ద జల అభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది రైతులకు మంచి పంటలు పండాలని, జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం కావాలని పూజలు నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో పీర్ సాబ్ సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాకాలం ముగిసేంతవరకు దాదాపు మరో నెల దాకా జిల్లాలో శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో శానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తాగునీటికి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఎరువుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బెళగల్ కస్తూర్బా పాఠశాల వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు ఏలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు నుంచి బెళగల్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ తిమ్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
HYD-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా <<13688589>>ఓర్వకల్లు<<>> మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. 10,900 ఎకరాలను 11 గ్రామాల పరిధిలో సేకరించి ఏపీఐఐసీకి అప్పగించగా నోడ్ పాయింట్గా కేంద్రం 2020లో నోటిఫై చేసింది. ఇక్కడ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 3వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు. నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.