India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా కోసిగిలో సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంకటేశ్ నాలుగు రోజుల కిందట కుటుంబంతో కలిసి వేరే ఊరెళ్లారు. గ్రామానికి చెందిన భీమయ్యతో పాటు మరో ఇద్దరు చోరీకి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు భీమయ్యను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చోరీకి యత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
డోన్ పట్టణ సమీపంలోని అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల సూపర్వైజర్ సుప్రజ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. గురుకులంలో విద్యార్థులచే చెత్త తొలగింపు పనులు చేపట్టడంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి. విద్యార్థులతో పని చేయించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు వాట్సాప్, ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రిన్సిపల్ సూపర్వైజర్ను మందలించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
నంద్యాల-రేణిగుంట డెమో రైలు (07284) జులై 22 నుంచి 26 వరకు కడప వరకు మాత్రమే వెళ్తుందని నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజరు దొరస్వామి పేర్కొన్నారు. గుత్తి-రేణిగుంట మార్గంలో రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున రైలు రేణిగుంట వరకు వెళ్లకుండా కడపలో ఆగుతుందని తెలిపారు. రేణిగుంట నుంచి బయలుదేరేందుకు బదులుగా కడప నుంచి రైలు (07285) బయలు దేరుతుందన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, పోరంబోకు అన్ని రకాల భూములలో అవకతవకలు జరిగాయని ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కర్నూలులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో విలువైన భూములను సర్వే నంబర్లు మార్చి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.
క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారన్నారు. వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దన్నారు.
నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. CIలు రవీంద్ర, దస్తగిరి బాబు పాల్గొన్నారు.
మండల కేంద్రం వెల్దుర్తిలోని 12వ వార్డులో ‘<<13679976>>పేరుకుపోయిన చెత్త<<>>’ అనే శీర్షికతో ఈ రోజు ఉదయం Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు, అందుకు కృషి చేసిన Way2News యాజమాన్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
భర్త నుంచి తనను కాపాడాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బనగానపల్లెకు చెందిన ఉప్పరి అన్నపూర్ణ అనే మహిళ భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం తరచూ హింసిస్తుంటే రూ.లక్ష ఇచ్చామని అయినా మరికొంత డబ్బు కావాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టాలంటూ తనపై దాడి కూడా చేశాడని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు.
కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.43 ఉండగా 52 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 48 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.76 ఉండగా 33 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 30 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.87గా ఉంది.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. రోడ్లకు మరమ్మతులు, పరిశ్రమల ఏర్పాటు, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించేలా జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం <<13679639>>దృష్టికి<<>> తీసుకెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.