Kurnool

News January 6, 2025

ఆస్పరి: ఆడుకుంటూ నిప్పు అంటించుకున్న చిన్నారులు

image

ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బైక్‌లో పెట్రోల్‌ను బాటిల్లోకి తీసుకొని, ఒకరిపై ఒకరు చల్లుకొని నిప్పు అంటించుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

News January 6, 2025

కర్నూలు: ‘నేడు ఎస్పీ కార్యాలయంలో గ్రివెన్స్ డే రద్దు’

image

పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య సామర్ధ్య పరీక్షల బందోబస్తు విధులలో పోలీసు అధికారులు ఉన్న కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఎవరూ వ్యయ, ప్రయాసలతో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదిదారులు రావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News January 5, 2025

ఆళ్లగడ్డ: యువకుడి ఆత్మహత్య

image

ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామానికి చెందిన శివపుల్లయ్య కుమారుడు మల్లికార్జున(25) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నెల10న ఇంటిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్సకై తరలించగా కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, చదువుకున్నా నిరుద్యోగిగా మిగిలిపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 5, 2025

రేషన్ డీలర్ల పరీక్షలకు 625 మంది అభ్యర్థుల హాజరు

image

కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన చౌకధరల దుకాణాలకు, వివిధ రకాల కారణాలతో ఖాళీలు ఏర్పడిన 74 చౌకధరల దుకాణాలకు ఆదివారం ఐజీఎంఎం పాఠశాలలో పరీక్షను నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్, కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి సందీప్ కుమార్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షకు 625 మంది అభ్యర్థులు హాజరైనట్లు వారు తెలిపారు.

News January 5, 2025

15 నిమిషాల ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు

image

ఆదోని ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో ఆదివారం జరిగిన రేషన్ డీలర్ల పరీక్షకు 15 నిమిషాల ఆలస్యం కారణంగా పెద్దతుంబలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మను అధికారులు అనుమతించలేదు. ఆమె తన మావయ్య చనిపోయాడని, అందువల్లే ఆలస్యమైందని అధికారులను వేడుకున్నా.. ఏమాత్రం కనికరం చూపలేదు. దీంతో ఏడాది చంటి పిల్లాడిని ఎత్తుకు నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు తన పరిస్థితిని అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News January 5, 2025

నందికొట్కూరులో వైరల్ అవుతున్న నో పార్కింగ్ బోర్డు

image

నందికొట్కూరులోని ఓ మందుల దుకాణం ముందు ఏర్పాటు చేసిన ‘నో పార్కింగ్ బోర్డు’ వైరల్‌గా మారింది. ‘దుకాణాల ముందు వాహనాలు నిలుపరాదు’ అంటూ నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం చూశాం. అయితే ఓ దుకాణం యజమాని చెప్పు గుర్తుతో బోర్డు ఏర్పాటు చేశాడు. ‘వాహనాలు నిలిపితే చెప్పుతో కొడతా’ అని అర్థం వచ్చేలా ఆ బోర్డు ఉంది.

News January 5, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

News January 5, 2025

సీఎస్ కర్నూలుకు రావడం గర్వకారణం: కలెక్టర్

image

కర్నూలుకు రావాలని ఆహ్వానించగానే చీఫ్ సెక్రటరీ విజయానంద్ జిల్లాలో పర్యటించడంపై కలెక్టర్ పీ.రంజిత్ బాషా హర్షం వ్యక్తం చేశారు. బీ.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎస్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నట్లు సీఎస్‌కు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం అమలు హర్షణీయమని కలెక్టర్ కొనియాడారు.

News January 4, 2025

కబళించిన మృత్యువు!

image

ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.

News January 4, 2025

నంద్యాల: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

image

నంద్యాల నుంచి దిగువ మెట్ట వెళ్లే మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్లే రైలులో ఓ వ్యక్తి ప్రయాణం చేశారని చెప్పారు. చలమ నుంచి దిగువమెట్ట వరకు ఉన్న రైలు మార్గంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.