Kurnool

News January 4, 2025

విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి: కలెక్టర్

image

విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.

News January 3, 2025

‘కొత్త ఇసుకను రీచ్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి’

image

రాష్ట్రంలో కొత్త రీచ్‌లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఇసుక సరఫరా అంశంపై గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పీ.రంజిత్ బాషా హాజరై మాట్లాడారు.

News January 3, 2025

ఉపాధి పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలని ఏపీడీ, ఏపీవోలను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. అధ్వాన రీతిలో ప్రగతి చూపిన అధికారుల ఫైళ్లను సర్క్యులేట్ చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు.

News January 3, 2025

టమాటా రైతులకు కాస్త ఊరట

image

పత్తికొండ టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.

News January 3, 2025

డాక్టర్లూ మీరు గ్రేట్ ❤

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మం. కలుగొట్ల గ్రామ ప్రజలకు ఆ ఊరికి చెందిన నలుగురు డాక్టర్లు ఉచిత వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్, జాన్ పాల్, మద్దమ్మ, కృష్ణ అనే వైద్యులు గురువారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, తదితర టెస్టులు చేసి ఫ్రీగా మందులు అందించారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహించామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News January 3, 2025

కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News January 3, 2025

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు షేక్ ఆఫ్రిది

image

ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోయే ఏపీ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు షేక్ అఫ్రీద్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు నీలిమ, కార్యదర్శి భానుప్రసాద్ తెలిపారు. షేక్ ఆఫ్రిది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచాడని పేర్కొన్నారు.

News January 3, 2025

ఉప వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సభ్యుడు సమావేశం

image

షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ పీ.రంజిత్ భాషా హాజరయ్యారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతిపత్రాలను రాజీవ్ రంజాన్ మిశ్రా స్వీకరించారు.

News January 2, 2025

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం: కలెక్టర్

image

2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య, డీఆర్‌వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

News January 2, 2025

KNL: విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు.. YCP ఫైర్

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురుకులంలో ఓ విద్యార్థినిపై లైబ్రేరియన్ <<15043665>>లైంగిక<<>> వేధింపులకు పాల్పడిన ఘటన నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ఏపీలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని ఆరోపించింది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారా? అంటూ సీఎం CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.