India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చిన మాట కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు HM G.సుబ్బారెడ్డి. ఈయన ఉదయగిరి(M) పుల్లాయపల్లి MPP పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల DSCలో TGT ఉద్యోగం వచ్చింది. ఆయన ఇది వరకే పట్టణంలో చదువుకొంటున్న పలువురు పేద విద్యార్థులను ఆయన పాఠశాలకు రప్పించుకుని మంచి విద్యను అందిస్తున్నారు. పైతరగతి విద్యార్థులతో స్టడీ అవర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వెళితే పిల్లలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఉద్యోగాన్ని వద్దనుకున్నారు.
ఉదయగిరి జిల్లా ఏర్పాటుకు మాజీ ఉపరాష్ట్రపతి M.వెంకయ్య నాయుడును ఉద్యమ నేతలు మద్దతు కోరారు. ఆదివారం వెంకటాచలంలోని స్వర్ణ భారతి ట్రస్టులో ఆయన్ను ఉద్యమ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఉదయగిరిని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వారు కోరారు.
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. ఆదివారం ఐదో రోజు సందర్భంగా ఎక్కువ మొత్తంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చేటపుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
నూతన పాలసీ కింద నెల్లూరు జిల్లాలో 55 బార్లు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 21షాపులకు మాత్రమే 94 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరులో 15, కావలిలో 3, కందుకూరులో 3.. మొత్తం 21 బార్లను కొత్తవారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఇవి కాకుండా జిల్లాలో ప్రస్తుతం 47 బార్లుకు లైసెన్స్ ముగిసింది. వీటిని నేటి రాత్రి నుంచి పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఇకపై నెల్లూరు, కావలి, కందుకూరులోనే బార్లు అందుబాటులో ఉండనున్నాయి.
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నెల్లూరు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, ప్రతి పిల్లవాడికి రూ.15 వేల చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఓపెన్ కేటగిరీకి సంబంధించి 50 బార్లకు, గీత కులాలకు సంబంధించి ఐదు బార్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 21 బార్లకు సంబంధించి 94 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా బార్లను కేటాయించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.
నెల్లూరు జిల్లాలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు గిరిజనుల కోసం ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6న కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP కృష్ణకాంత్ వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రాణమంటే ఎవరికైనా తీపేనని.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి చెప్పారు. ‘మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందనే వివాదాలు చుట్టుముట్టాయని అంటున్నారు. నేను మూడోసారి గెలిచి 14 నెలలు అవుతోంది. అందరికీ మంచే చేశాను. ఏ వివాదాల జోలికి నేను వెళ్లలేదు. పోలీసుల వైఫల్యం లేదు. వీడియో గురించి ఎస్పీకి తెలిసిన వెంటనే నాకు చెప్పలేదనే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అని కోటంరెడ్డి అన్నారు.
నెల్లూరు VR కాలేజీలో విద్యార్థులను రౌడీలు బెదిరిస్తే.. అప్పట్లో తాను పరిగెత్తించి కొట్టానని రూరల్ MLA కోటంరెడ్డి అన్నారు. ‘జీవితంలో తప్పు చేయను. ఎవరికీ భయపడను. ఈ గూండాలు, రౌడీల బెదిరింపులకు ఏడేళ్ల వయసున్న నా మనవడు, మనవరాళ్లు కూడా భయపడరు. నన్ను చంపితే డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారో పోలీసులే తేల్చాలి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రవర్తిస్తోంది’ అని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.