India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం ఇఫ్కో సీఈవో ఉదయ్ శంకర్ అవస్థిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకుశంగా చర్చించారు. కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని MP వివరించారు.
బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ చిన్నారికి ఏ కష్టం వచ్చిందో ఏమో. 6వ తరగతికే ఈ జీవితం చాలు అనుకుంది. 11 ఏళ్ల ప్రాయంలోనే బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంటకు చెందిన బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ ఇంట్లోని బాత్ రూములో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గూడూరులో ఓ ఎంటెక్ విద్యార్థి చనిపోయాడు. స్థానికంగా ఉన్న ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జశ్వంత్ ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో కాలేజీ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి అతను దూకేశాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన టీచర్ కుటుంబానికి భారీ పరిహారం అందింది. విడవలూరు(M) రామతీర్థం స్కూల్ పీఈటీ దాసరి కామరాజ్ 2016 మే27న బైకుపై నెల్లూరుకు వెళ్లాడు. తిరిగొస్తుండగా గుండాలమ్మపాలెం వద్ద గుంతలో పడి చనిపోయారు. అక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతో చనిపోయారని బంధువులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కామరాజ్కు ఇంకా 12ఏళ్ల సర్వీస్ ఉండటంతో రూ.1.30కోట్లు చెల్లించాలని R&B శాఖను కోర్టు ఆదేశించింది.
ఆర్మీలో చేరాలనుకుంటున్న నెల్లూరు యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 అగ్ని వీర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. ట్రైనింగ్తో పాటు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీలోపు www.joinindainarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. యువకులతో పాటు మహిళలు సైతం అప్లై చేసుకోవచ్చు.
మాజీ మంత్రి కాకాణి ఎక్కడ ఉన్నారు..? పోలీసులకు చిక్కకుండా ఎన్ని రోజులని దాక్కుంటారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ ప్రశ్నించారు. తప్పులు చేయడం, పరారవడం మీకు(వైసీపీ) అలవాటే కదా అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పే మాటలు, చేసే పనులకు ఎప్పుడూ పొంతన ఉండదని విమర్శించారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రుస్తుం మైన్ వేదికగా కాకాణి గతంలో చేసిన పాపాలే ఇప్పుడు శాపాలై వెంటాడుతున్నాయన్నారు.
నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త చెప్పారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు త్వరలో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలకు ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రెండో పంట కోసం ఐఏబీ సమావేశం నిర్వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, కలెక్టర్ ఆనంద్కు లేఖ రాశారు. ప్రస్తుతం సోమశిలలో 53.374 టీఎంసీలు, కండలేరులో 48.517 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. రెండో పంటకు నీటి కేటాయింపులకు సంబంధించి ఐఏబీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.