India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై •> గుర్తు గల పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈనెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆయా మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకే అధికారులతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై PGRS కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

ఈనెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆయా మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకే అధికారులతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై PGRS కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్గా మారుతోంది. వైసీపీ సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు. మంత్రి మౌనం ఎన్నిరోజులు అనేది ప్రశ్నార్థకం.

నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్, ల్యాబ్ పరీక్షలు, అదనపు బెడ్స్ ఏర్పాటుకు అనుమతులు ఉండటం లేదు. అర్హత లేనివాళ్లు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు ఆసుపత్రి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఉదయగిరిలోని ఓ హాస్పిటల్లో 13 ఏళ్లుగా ఎలాంటి అనుమతలు లేకుండా వైద్యం అందించిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటిపై కలెక్టర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

నెల్లూరులో <<19612409>>సిటీ బస్సులు <<>>తిప్పుతామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వీటికంటూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే బస్సులకే టౌన్ స్టాఫింగ్ ఇచ్చారు. వాటిపై పల్లెటూరి పేర్లు ఉండటంతో టౌన్ బస్సులని చాలామందికి తెలియడం లేదు. వీటిని ఎవరూ ఆపడం లేదు. ప్రత్యేక బస్సులు వేయడం లేదా పల్లెటూర్ల వాటికే టౌన్ సర్వీసులు అని తెలిసేలా బోర్డులు పెడితే బాగుంటుంది.

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.

నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి తదితరులపై కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.