India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
బీజేపీలో 14 మందికి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో మంచిపట్టున్న నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.
రౌడీ షీటర్ ప్రియురాలు అరుణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బిల్డర్ను బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈకేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు అరుణను మూడు రోజుల కస్టడికీ తీసుకున్నారు. ఒంగోలు జైలు నుంచి కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడే ఆమెను విచారించనున్నారు.
మంత్రి ఆనం గురువారం సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన బాధితులకు దాదాపు రూ.83.34 లక్షలను చెక్కుల రూపంలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు రూ.4.20 కోట్లు అందించామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ రావడానికి టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలే కారణం అంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పెరోల్ కోసం వారిచ్చిన సిఫారసు లేఖలను హోం శాఖ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత గూడూరుకు చెందిన ఓ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీకాంత్కు పెరోలిప్పించేందుకు అరుణకు సహకరించారని జోరుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గాసిప్స్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ పొర్లుకట్ట వద్ద మంత్రి మంగళవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం వారికి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ అంశానికి తెరపడనుంది.
నేడు నెల్లూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో TDP విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. TDP జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. అబ్దుల్ అజీజ్ మరోసారి అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చెంచల్ బాబు యాదవ్ తదితరులు పదవిని ఆశిస్తున్నట్లు సమచారం.
నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బొకే అందించి స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఆయన్ను కలిశారు.
Sorry, no posts matched your criteria.