Nellore

News September 9, 2024

నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

నెల్లూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. కావలి పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన మొగిలి రమేష్(27) సోమవారం 3వ రోజు వినాయకుడి నిమజ్జనానికి తుమ్మలపెంట వెళుతుండగా.. కొలదిన్నె గిరిజన కాలనీ సమీపంలో ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. టైర్ అతడి పైనుంచి వెళ్లడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 9, 2024

నెల్లూరు నుంచి శబరిమలకు ఒంటికాలితో యాత్ర

image

నెల్లూరు నగరానికి చెందిన అక్కరపాక సురేశ్ ఆచారి వికలాంగుడు. అయినప్పటికీ ఒంటికాలితో శబరిమల పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులో బయలుదేరి పెంచలకోన మీదుగా శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు. సోమవారం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు చేరుకుంది. ఇలా సురేశ్ ఆచారి ఇదివరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టి మూడవసారి మొక్కు తీర్చుకునేందుకు శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు.

News September 9, 2024

నెల్లూరు: పునాస మామిడికి గిరాకీ ఎక్కువే

image

నెల్లూరు జిల్లాలో పునాస మామిడికి గిరాకీ పెరిగినట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. మేలు రకం కాయలను టన్ను రూ. 60వేల నుంచిరూ.70వేలు, మసర,మంగున్న కాయలు రూ.40 – 50 వేల వరకు పలుకుతున్నాయన్నారు. అయితే ఈ రకం కాయలకు కేరళలో డిమాండ్ ఎక్కువ. అక్కడ సెప్టెంబరులో జరిగే ఓనం పండుగకు ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్రతిరోజూ మన నెల్లూరు నుంచి 50-60 టన్నులు ఎగుమతి అవుతున్నాయని అంటున్నారు. ఈసారి ధరలు పెరిగాయన్నారు.

News September 9, 2024

నెల్లూరు: ఉద్యోగం పేరిట మోసం ..యువకుడు సూసైడ్

image

ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో నెల్లూరు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం.. నవాబుపేట వాసి హరినాథ్(44) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత కంపెనీలో ఉద్యోగాలు వెతుకుతుండగా.. నెల్లూరుకు చెందిన ప్రేమ్ చంద్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7లక్షలకు పైగా తీసుకున్నాడు. బాధితుడు నిలదీయగా రూ.5.57 లక్షలు అకౌంట్లో వేశానని నకిలీ రసీదు ఇచ్చి పరారయ్యాడు. దీంతో ఈనెల 5న హరి సూసైడ్ చేసుకున్నాడు.

News September 9, 2024

నెల్లూరులో అండర్ -14 క్రికెట్ జట్టు ఎంపిక

image

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా అండర్ – 14 క్రికెట్ జట్లను ఈ నెల 15న ఎంపిక చేయనున్నామని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్, డ్రస్ కోడ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 8, 2024

వేమిరెడ్డిని అభినందిస్తూ సీఎం లేఖ

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం భారీ విరాళం అందించిన వేమిరెడ్డిని అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖను విడుదల చేశారు.

News September 8, 2024

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న చవితి వేడుకలు

image

నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా రెండో రోజూ సందడి నెలకొంది. ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాలలో ఉట్టి ఉత్సవాలను యువత కోలాహలంగా జరుపుకున్నారు. నాయుడుపేట ముస్లిం వీధిలో అక్కడి ముస్లింలతో పాటు హిందువుల సైతం మతసామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉట్టి కార్యక్రమంలో యువత, మహిళలు, చిన్నారులు సైతం పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉట్టిని కొట్టారు.

News September 8, 2024

నెల్లూరు: అంగన్వాడీలకు 4నెలలుగా అందని కందిపప్పు

image

నెల్లూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో 2934 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో లక్ష 25వేలు మంది చిన్నారులు, 25వేలు గర్భవతులు బాలింతలు కలరు. వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో కందిపప్పు అందించాల్సి ఉంది. కందిపప్పు సరఫరా లేకపోవడంతో కేంద్రాల్లో ఆకుకూరలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.

News September 8, 2024

NLR: ఆరు నెలలుగా అందని జీతాలు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. పస్తులు ఉండాల్సి వస్తోందని చెప్పారు. రూ.16 వేలు జీతానికి రూ.12 వేలే ఇస్తున్నారని ఆరోపించారు. గత మూడేళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ నగదు ఇవ్వడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 8, 2024

కావలి: మత్తులో వ్యక్తి వీరంగం

image

కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.