Nellore

News April 8, 2025

నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

image

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

News April 7, 2025

కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

image

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.

News April 7, 2025

కాకాణికి ఊరట లభించేనా..?

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా నేడు మరోమారు హైకోర్టులో కాకాణి బెయిల్‌పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు కాకాణి ఎక్కడున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News April 7, 2025

నెల్లూరులో నేటి ధరలు ఇవే..!

image

నెల్లూరు జిల్లాలో బంగారం, చికెన్, నిమ్మ ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల బంగారం(10గ్రా): రూ.91,570
➤ 22 క్యారెట్ల బంగారం(10గ్రా): 83,100
➤కేజీ నిమ్మకాయలు: రూ.110 (పెద్దవి)
➤కేజీ నిమ్మకాయలు: రూ.80 (చిన్నవి)
➤కేజీ నిమ్మ పండ్లు: రూ.50
➤కేజీ బ్రాయిలర్ కోడి: రూ.113
➤కేజీ లేయర్ కోడి: రూ.100
➤కేజీ బ్రాయిలర్ చికెన్: 202
➤కేజీ లేయర్ చికెన్: 170

News April 7, 2025

నెల్లూరు: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య(ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. గత శుక్రవారమే కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్‌, జిల్లా కోఆర్డినేటర్ సుధీర్‌కు సమ్మె నోటీసు అందజేశామని చెప్పారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News April 7, 2025

NLR: ఇంటర్ అమ్మాయితో అసభ్య ప్రవర్తన

image

పాఠాలు చెబుతానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నెల్లూరులో జరిగింది. నగరానికి చెందిన యువతి దర్గామిట్టలోని ఓ బిల్డింగ్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే భవనంలోని ఇన్సురెన్స్ ఆఫీస్‌లో శ్రీనివాసులు రెడ్డి పనిచేస్తున్నాడు. కెమెస్ట్రీలో డౌట్స్ క్లియర్ చేస్తానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.

News April 7, 2025

సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

image

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్‌కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.

News April 7, 2025

స్వగ్రామంలో వెంకయ్య నాయుడు పూజలు

image

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగ్రామమైన వెంకటాచలం మండలం చౌటపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన మనువడు విష్ణుబాబుతో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. సమాజంలో కనిపిస్తున్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముడి ఆదర్శాలే సరైన పరిష్కారమని వెంకయ్య నాయుడు సూచించారు.

News April 6, 2025

శ్రీరాముని ఆదర్శాలతో వివక్షలు లేని సమాజం: వెంకయ్య 

image

సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్ష, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలం(మ) శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో అయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడు ఆదర్శం కావాలని, ప్రతి గ్రామంలోనూ రామాయణ పారాయణం జరగాలన్నారు.

News April 6, 2025

నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

image

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.