Nellore

News August 19, 2024

24 టీఎంసీలకు చేరిన సోమశిల జలాశయం

image

సోమశిల జలాశయానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి 10,620 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరధ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 24.191 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 115 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

News August 18, 2024

రేపు నెల్లూరు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సోమశిల ప్రాజెక్టు రిజర్వాయర్‌ను పరిశీలించుటకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు సోమశిల రిజర్వాయర్ వద్ద హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

News August 18, 2024

నెల్లూరులో వెలుగు చూసిన ఘరానా మోసం

image

నెల్లూరులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మనీ స్కీం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ట్రస్ట్ పేరుతో జనాలకు టోకరా వేశారు. బాధితుల వివరాలు మేరకు.. చెన్నైకి చెందిన ఓ సంస్థ నెల్లూరు పొదలకూరు రోడ్డు వద్ద ఇంకో ట్రస్ట్ సహాయంతో ఒక సభ్యత్వానికి రూ.500 కడితే రూ.7లక్షలు, మరో సభ్యత్వానికి రూ.5 వేలు కడితే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 10 వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారని బాధితులు లబోదిబోమన్నారు.

News August 18, 2024

నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్‌కు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 18, 2024

ముసునూరు: గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యం

image

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండల పరిధిలోని ముసునూరు పంచాయతీ కొత్త గుంట నీటిలో గుర్తుతెలియని 15 నెలల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విలేజ్ రెవెన్యూ అధికారి సమక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 18, 2024

నెల్లూరు: ఇసుక సమస్య కోసం టోల్ ఫ్రీ నంబర్

image

ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే 0861- 2943569 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చని నెల్లూరు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇసుక డిపోలలో నిల్వలు తగ్గిపోతున్నందున టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలన్నారు.

News August 18, 2024

నెల్లూరు: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ: గవర్నర్

image

మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో శనివారం జరిగిన స్వర్ణ భారత్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

News August 17, 2024

వరికుంటపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News August 17, 2024

నెల్లూరు నుంచి తిరుగు పయనమైన ఉప రాష్ట్రపతి

image

నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు వీడ్కోలు పలికారు. వీరితో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్లారు. వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా అధికారులు కూడా ఉన్నారు.

News August 17, 2024

నెల్లూరు: బాధితుల పోస్ట్‌కు స్పందించిన నారా లోకేశ్

image

ఎక్స్‌ట్రా ట్రిట్‌మెంట్‌ చేయించడానికి డబ్బులు సరిపోవడంలేదని, ఎవరైన హెల్ప్‌ చేయాలని నెల్లూరుకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి మంత్రి నారాలోకేశ్ స్పందించారు. అతడిని మేం చూసుకుంటాం. నా బృందం వారిని చేరదీస్తుంది అమ్మా! అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.