Nellore

News April 17, 2024

అక్రమ రవాణ కట్టడికి పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా మనుబోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 120 ఫ్యాన్లు, 24 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏఎస్ పేట పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3500 నగదు, 255 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 17, 2024

నెల్లూరు జిల్లాలో నామినేషన్ల కేంద్రాలు ఇవే..!

image

☞ నెల్లూరు MP: నెల్లూరు కలెక్టర్ ఆఫీసు
☞ నెల్లూరు సిటీ MLA: కార్పొరేషన్ ఆఫీసు
☞ రూరల్ MLA: నెల్లూరు RDO ఆఫీసు
☞ కావలి MLA: కావలి RDO ఆఫీసు
☞ ఆత్మకూరు MLA: మున్సిపల్ ఆఫీసు
☞ కోవూరు MLA: కోవూరు MRO ఆఫీసు
☞ సర్వేపల్లి MLA: వెంకటాచలం MPDO ఆఫీసు
☞ ఉదయగిరి MLA: ఉదయగిరి MRO ఆఫీసు
☞ వెంకటగిరి MLA: వెంకటగిరి MRO ఆఫీసు
☞ గూడూరుMLA: గూడూరు RDO ఆఫీసు
☞ సూళ్లూరుపేట MLA: SLPT RDO ఆఫీసు

News April 17, 2024

ఆనం చరిత్రహీనుడు: విజయసాయి రెడ్డి

image

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డే టార్గెట్‌గా YCP నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శులు చేశారు. ‘TDP నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆనంకి రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చి పెద్దోడిని చేసింది YSR. జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ అధిష్ఠానం కుట్రలో భాగస్వామి అయ్యాడు. మళ్లీ జగన్ పంచన చేరి MLA అయినా వెన్నుపోటు గుణాన్ని పోనిచ్చుకోలేదు. ఈ వయసులో పార్టీ మారి చరిత్రహీనుడయ్యాడు’ అని ట్వీట్ చేశారు.

News April 17, 2024

కావలి: ఐదుగురి మరణానికి కారణం అదే..!

image

నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.

News April 17, 2024

20న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం సర్వేపల్లి నియోజకవర్గంలో, సాయంత్రం కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి ప్రచార సభలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది.

News April 17, 2024

నెల్లూరు : నామినేషన్ కేంద్రాలివే…

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. నెల్లూరు ఎంపీ స్థానానికి కలెక్టరేట్ లో, కందుకూరుకు సబ్ కలెక్టర్ ఆఫీసులో, కావలికి ఆర్డీఓ ఆఫీసులో, ఆత్మకూరుకు మున్సిపల్ ఆఫీసులో, కోవూరుకు కోవూరు తహశీల్దార్ ఆఫీసులో, నెల్లూరు సిటీకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో, నెల్లూరు రూరల్ కు ఆర్డీఓ ఆఫీసులో, సర్వేపల్లికి వెంకటాచలం ఎంపీడీఓ ఆఫీసులో, ఉదయగిరికి ఉదయగిరి తహశీల్దార్ ఆఫీసులో స్వీకరిస్తారు

News April 17, 2024

నెల్లూరు: శ్రీరాముడు నడియాడిన ప్రాంతం ఇక్కడే..

image

రామతీర్థం గ్రామం సముద్రతీరాన ఉంది. స్థల పురాణం ప్రకారం.. సీతాన్వేషణకు వెళుతున్నశ్రీరాముడు ఒకరోజు ఈ ప్రాంతానికి వచ్చి సూర్యోదయసమయంలో శివుణి ప్రతిష్ఠించి అర్చన చేశాడు. రాములవారి పాదస్పర్శ ఏర్పడిన ఈక్షేత్రం “రామతీర్థం” గానూ, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక శ్రీ రామలింగేశ్వరస్వామి గానూ పూజలందుకుంటున్నాడు. 14వ శతాబ్దంలో పల్లవరాజులు స్వామివారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రికఆధారాలు ఉన్నాయి.

News April 17, 2024

నెల్లూరును ఇండస్ట్రియల్  కారిడార్‌గా అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి

image

తాను గెలిస్తే నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తానని నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామలింగపురం, ముత్యాలపాలెం ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

News April 17, 2024

నెల్లూరు నగరంలో పలువురు టీడీపీలో చేరిక

image

నెల్లూరు సిటీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 43వ డివిజన్‌కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పలువురు టీడీపీలో చేరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని జండా వీధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పార్టీ కండువాలు కప్పారు.

News April 17, 2024

నామినేషన్ల ట్రయల్‌రన్‌ విజయవంతం

image

2024 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18 నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ నేతృత్వంలో నామినేషన్ల ట్రయల్‌రన్‌ విజయవంతంగా నిర్వహించారు. కలెక్టరు వారి చాంబర్‌లో మంగళవారం నామినేషన్ల స్వీకరణ ట్రయల్‌ రన్‌ చేపట్టారు. నామినేషన్‌ ప్రాసెస్‌ చేయడానికి తగిన సిబ్బందిని నియమించుకుని నామినేషన్‌ పరిశీలించారు.