India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీఎస్సీ-25కు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దని నెల్లూరు DEO బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో పోస్టులు భర్తీ కొరకు కాల్ లెటర్ అందిన అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు జిరాక్స్, గెజిటెడ్ అటిస్ట్రేషన్తో పాటు 5 ఫోటోలు తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని జిల్లాలోని 29 MEOలకు DEO బాలాజీ రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్ రికగ్నైజ్ యాప్(FRS)లో హాజరు నమోదు చేసుకోవాలి. అయితే అందుకు భిన్నంగా వారు హాజరు నమోదు చేసుకోకపోవడంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాకు వెళ్లొద్దంటూ విధించిన షరతులపై స్టే ఇచ్చింది. దీంతో ఆయన నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. మిగిలిన షరతులను యథాతధంగా ఉంచింది.
తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.
నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు అందిస్తున్నందుకు ఎన్ఏబీఎల్ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్కు జాతీయస్థాయి గుర్తింపు రావడంతో కలెక్టర్ ఆనంద్ వారిని అభినందించారు.
CM చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, YCP అధినేత జగన్ పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కీలక సమయంలో ఎరువులు అందలేదు. YCP ప్రభుత్వం RBKల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది’ అని అన్నారు.
నెల్లూరు రూరల్, గూడూరు MLAలు కోటంరెడ్డి, సునీల్ కుమార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్కు తాము ఇచ్చిన సిఫార్స్ లెటర్లు తిరస్కరించారని.. ఆ వివాదంతో తమకు సంబంధం లేదని MLAలు అంటున్నారు. లెటర్లు రిజెక్షన్ సరే.. అసలు జైలు నుంచి నేరస్థుడిని విడుదల చేయడానికి సిఫార్స్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మంచి పనులకు లెటర్లు ఇవ్వాల్సిన MLAలు రౌడీషీటర్ కోసం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నెల్లూరు జైలులో ఉన్న శ్రీకాంత్ పెరోల్ విషయం హాట్ టాపిక్గా మారింది. అతనికి ఫెరోల్ ఇవ్వాలంటూ నెల్లూరు రూరల్, గూడూరు MLAలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్ సిఫార్స్ లేఖలు ఇవ్వగా జులై 16న వాటిని జైళ్లశాఖ తిరస్కరించింది. జులై 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్యే లెటర్లు రిజెక్ట్ చేసిన తర్వాత పెరోల్ రావడం వెనుక ఎవరి సిఫార్సు ఉందనేది తెలియాల్సి ఉంది.
ప్రియుడి వేధింపులు తాళలేక ఓ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు YSR నగర్లో శివలక్ష్మి(34), ఆమె కుమార్తె యక్షిత నివాసముంటున్నారు. సింగరాయకొండ(M) బింగినపల్లికి చెందిన శివకుమార్ ఆమెతో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న ఇద్దరి మధ్య విదాదం జరగడంతో శివలక్ష్మి ఊరేసుకుంది. శివకుమార్ వేధింపులే తల్లి మృతికి కారణమని యక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నెల్లూరు ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో కొన్ని ఆధారాలను వైసీపీ బయట పెట్టింది. శ్రీకాంత్ పెరోల్ మంజూరు వ్యవహారంలో ఉమ్మడి నెల్లూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకం చేసినట్లు వైసీపీ స్పష్టం చేసింది. అధికారులు వద్దన్నా ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జులై 30న జీవో జారీ అయినట్లు వైసీపీ X వేదికగా తెలిపింది.
Sorry, no posts matched your criteria.