India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతసాగరం, మినగల్లుకు చెందిన మస్తాన్ బాష ఈతకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం స్నేహితులతో ఉత్తర కాలువలోకి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండడంతో..కొట్టుకుపోయాడు. సమాచారమందుకున్న పేరెంట్స్ గాలించినా దొరకకపోవడంతో..పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఉదయం గాలించగా..నన్లరాజుపాలెం సమీపంలో డెడ్ బాడీ లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
PM కిసాన్ పేరిట వాట్సాప్కు వచ్చిన ఓ ఫైల్ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైన ఘటన నెల్లూరులో జరిగింది. బాధితుని కథనం.. గోమతి నగర్కు చెందిన ప్రసాద్ రావుకు వాట్సాప్లో పీఎం కిసాన్ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేశాడు. తర్వాత గత నెల 29న ఫోన్పే ఓపెన్ చేసి చూడగా.. మూడు సార్లు రూ. 2,59,970 డ్రా చేసినట్లు చూపించింది. దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ రోశయ్య దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8 తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది.
మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.
నెల్లూరు జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టాల అమలుపై జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం తన ఛాంబర్లో మంగళవారం నిర్వహించారు. గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.
ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అనంతసాగరం మండలంలో మంగళవారం జరిగింది. అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బాష (21) సోమశిల ఉత్తర కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు పొదలకూరు, హైదరాబాదుకు వెళ్లినా అందుబాటులో లేరు.ఇవాళ ఉ.11గంటలకు నెల్లూరు DSP ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా APR 18కి విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్గా మారింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.