India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు రంగనాయకుల గుడి వెనుక వైపు ఉన్న వారధి వద్ద డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. ఎస్పీ డా.అజిత వెజెండ్ల, DSP సింధూ ప్రియ పర్యవేక్షణలో సంతపేట CI దశరథ రామారావు విచారణ చేపట్టారు. హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడే, రేపో నిందితుల వివరాలు బహిర్గతం చేస్తారని తెలుస్తోంది.

మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో DSP, ఆపై స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలెమెంట్స్, గాంజా, మిస్సింగ్ కేసులు, పోక్సో వంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

జిల్లాలో ఎడగారు సీజన్కు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 40 శాతం కోతలు సైతం అయిపోయాయన్నారు. కేవలం 2 వేలు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కోతలు దాదాపు పూర్తయ్యే దశలో PPC లను ఏర్పాటు చేయడంతో అన్నదాతలు బాగా నష్టపోయారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి ఉపయోగపడలేదని రైతన్నలు ఆరోపిస్తున్నారు.

కలిగిరి మండలంలోని వెలగపాడు సచివాలయం ముందు గల బస్ షెల్టర్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40- 45 ఏళ్లు ఉండవచ్చని, చనిపోయిన వ్యక్తి వేసుకున్న షర్ట్ కాలర్ మీద “Pavan Men’s Wear” పామూరు అని ఉన్నట్టు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే కలిగిరి PS 9440700098 నంబర్కు సంప్రదించాలన్నారు.

జిల్లాలో అక్రమ యూరియా, నకిలీ విత్తనాలు ఎరువులు సంబంధించిన సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు అక్రమ యూరియా నిల్వలు నివారణకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏమైనా సమాచారం ఉన్న 8331057225 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని Way2News ఫోన్లో సంప్రదించగా.. కోల్డ్రిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిధులు చాలా మంది ఆటో డ్రైవర్స్కి రాలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉండి కూడా నిధులు జమకాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దగ్గర్లోని సచివాలయంలో ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తే.. వారు ప్రభుత్వం రూపొందించిన యాప్లో రిజిస్టర్ చేస్తారు. ఆ ఫిర్యాదు నేరుగా రవాణా శాఖకి వెళ్తుంది. వారి అన్నీ పరిశీలించి అర్హత ఉంటే రూ.15 వేలు ఆటో డ్రైవర్స్ అకౌంట్లో జమ చేస్తారు.

ప్రేమిస్తున్నానని వెంటపడి పదో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో శశి అనే యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఓ దుకాణంలో పనిచేసే శశి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. బాలికను బైక్పై ఎక్కించుకొని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై బలత్కారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై సీఐ రామారావు పోక్సో కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.