Nellore

News August 29, 2024

నెల్లూరు: ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి UPDATE

image

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు పాళ్య గేటు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసులు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారందరూ కూడా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య పుష్ప, కుమారుడు శ్రీకాంత్ గా గుర్తించారు. విహహానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 29, 2024

కావలి: కూతురు నల్లగా పుట్టిందని భార్యకు వేధింపులు

image

కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన మొహిద్ అనే వ్యక్తిపై కావలి ఒకటో పట్టణపోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. మొహిద్‌‌కు మూడేళ్ల కిందట వివాహమైంది. తనకు పుట్టిన కూతురు నల్లగా ఉందని భర్త మొహిద్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు భార్య ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News August 29, 2024

నెల్లూరు: ఘోర ప్రమాదం..ముగ్గురి మృతి

image

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుపాళ్య గేటు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో పన్నెండు మంది గాయపడ్డారు. చిత్తూరు నుంచి చింతామణికి వస్తున్న టెంపో -బెంగుళూరు నుంచి కడప హైవే మార్గంలో వెళుతున్న కారును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ , శ్రీనివాసులు , పుష్ప అక్కడికక్కడే చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

News August 29, 2024

కండలేరు ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన సోమిరెడ్డి

image

కండలేరు జలాశయం ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జలాశయం వద్ద ఉన్న మోటారు ద్వారా కాలువకు నీటిని విడుదల చేశారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి నీటిని విడుదల చేశారు. ఇటీవల వేసవి తాపానికి నిమ్మ, మామిడి, కూరగాయల సాగు రైతుల ఇబ్బందులు చూసి నీరు విడుదల చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

News August 28, 2024

పార్టీ మారనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద ?

image

వైసీపీ రాజ్యసభ సభ్యుడు కావలి ప్రాంతానికి చెందిన బీద మస్తాన్ రావు పార్టీ మారనున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈయన టీడీపీ కావలి ఎమ్మెల్యేగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నట్లు వస్తున్న ఊహగానాల్లో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News August 28, 2024

నెల్లూరు: ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

రాపూరు మండలం చిట్వేల్ ఘాట్ రోడ్డు సమీపంలోని ఆరో మైలు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, బైకు, ఆర్టీసీకి చెందిన పెళ్లి బస్సు ఒక్కసారిగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వెంకటాచలం మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన వీరేపల్లి వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News August 28, 2024

నెల్లూరు : ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకాల ఫోర్జరీ కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నగరపాలక సంస్థ టీపీఓ దేవేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్, నుడా కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News August 28, 2024

నెల్లూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట కేవీఆర్ సర్కిల్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, గ్రావెల్ టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సుమారు 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News August 28, 2024

కోవూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పి

image

SPS నెల్లూరు జిల్లాలోని సంతపేట, కోవూరు పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్.పి. జి.కృష్ణకాంత్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్స్ పరిధిలో ఉన్న హైవే, నేర, శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు.
మహిళా సంబంధిత సమస్యలపై సత్వరమే స్పందించి, పరిష్కరించాలని ఆదేశించారు.

News August 27, 2024

నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్‌కు గుండెపోటు

image

2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఖలీల్ అహ్మద్‌కు గుండెపోటు వచ్చింది. అతనిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ కు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఖలీల్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.