India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రేమిస్తున్నానని వెంటపడి పదో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో శశి అనే యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఓ దుకాణంలో పనిచేసే శశి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. బాలికను బైక్పై ఎక్కించుకొని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై బలత్కారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై సీఐ రామారావు పోక్సో కేసు నమోదు చేశారు.

జిల్లాలో అనాధకార లేఅవుట్లుగా 437 వరకు ఉన్న.. వీటి క్రమబద్ధీకరణకు కేవలం 23 దరఖాస్తులు మాత్రం రావడం గమనర్హం. అధికారులు అక్రమ లేవట్లను క్రమబద్ధీకరించేందుకు పలు విధాలుగా అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ సదరు యజమానులు ముందుకు రావడం లేదు. అవసరమైన పత్రాలు, చలానాలు సమర్పించాల్సిన రావడంతో వారికి ఇబ్బందిగా మారుతుంది. మరోవైపు ప్రజా ప్రతినిధులు అండ దండలతో క్రమబద్ధీకరణకు రావడం లేదనేది తెలుస్తోంది.

నెల్లూరు – తిరుపతి మధ్యలో రాత్రయితే బస్సుల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఈ మార్గంలో నెల్లూరు బస్టాండ్లోనే బస్సులు నిండిపోవడంతో గూడూరు బస్టాండ్కు వెళ్లకుండానే నేరుగా తిరుపతికి వెళ్లిపోతున్నాయి. దీంతో గూడూరు బస్టాండ్కు బస్సులు రాకపోవడంతో బైపాస్లో అర్థ రాత్రయినా బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు ఈ పరిస్థితిని గమనించి ఈ సమయంలో సర్వీస్లను పెంచాలని కోరుతున్నారు.

కందుకూరులోని ఓ థియేటర్లో ప్రేక్షకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ఘటన వెలుగుచూసింది. టికెట్పై ధర ముద్రించకుండా ఒక్కో టికెట్కు రూ.200 వసూలు చేస్తున్నారని సినిమా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

PGRS అర్జీల స్థితి తెలుసుకొనేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు(D) కాకుటూరుకు చెందిన ముగ్గురు మైనర్లకు విముక్తి లభించింది. వీళ్లను బానిసలుగా చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఈక్రమంలో జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు దాడులు చేసి వారికి విముక్తి కల్పించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆ విభాగం ఏఎస్ఐ శ్రీహరి బాబు, పోలీస్ సిబ్బంది రాంబాబు చెప్పారు. ఈ ముగ్గురిని విశ్వ జననీ చైల్డ్ హోం కేర్లో చేర్చారు.

మహిళలపై జరుగుతున్న నేరాల్లో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 7వస్థానంలో ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ-2023 నివేదిక స్పష్టం చేస్తోంది. అత్యాచారం చేసి ఇద్దరిని హతమార్చారు. అదనపు కట్నం వేధింపులతో 6మంది చనిపోయారు. అత్తింటి వారి వేధింపులపై 507, అత్యాచారాలపై కేసులు 13, చిన్నారులపై వేధింపు కేసులు 121 నమోదయ్యాయి. 69 పోక్సో కేసులు, 585 మహిళల మిస్సింగ్ కేసులు ఫైలయ్యాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఎటువంటి టాలెంట్ టెస్ట్ నిర్వహించరాదని DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

నెల్లూరులో వింత జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ఓ రకమైన కీటకం కుట్టడంతో వెంకటేశ్వరపురం, కావలి, ఎన్టీఆర్ నగర్, మనుబోలు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ జ్వరం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను ఈ కొత్త రకం జ్వరం భయపెడుతోంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని.. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.