India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఖలీల్ అహ్మద్కు గుండెపోటు వచ్చింది. అతనిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ కు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఖలీల్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రమాదంలో గాయపడిన నెల్లూరు రూరల్ DSP శ్రీనివాసరావు ఇంటికి జిల్లా యస్.పి. కృష్ణకాంత్ వెళ్లి పరామర్శించారు. DSP ధైర్య సాహసాలను ఎస్పీ మెచ్చుకొని, స్యయంగా ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా పోలీసు యంత్రాంగం వారి వెంటే ఉందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. త్వరగా పూర్తిగా కోలుకొని, కలిసి విధులు నిర్వహించాలని రూరల్ DSP కి మనోధైర్యం చెప్పిన అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు.
➤ MS రాకేశ్ VR TO మనుబోలు
➤ B.రమేశ్ బాబు దర్గామిట్ట TO సంతపేట
➤ G.బాలకృష్ణ సెబ్ TO సంతపేట
➤ బి.వెంకటేశ్వర్లు DCRB TO నెల్లూరు రూరల్
➤ B.లక్ష్మణరావు గుడ్లూర్ TO నెల్లూరు రూరల్
➤ Sk.సుభాని బాలాజీనగర్ TO లింగసముద్రం
➤ M.బాజీబాబు లింగసముద్రం TO నెల్లూరు VR
➤ P.అనూష సీతారామపురం TO సోమశిల
➤ PS V.సుబ్బారావు సోమశిల TO VR
➤ శ్రీనివాసరావు VR TO మర్రిపాడు
నాయుడుపేట(M) మేనకూరుకు చెందిన డాక్టర్ రమేశ్ బాబు అమెరికాలో <<13935471>>మృతిచెందిన <<>>విషయం తెలిసిందే. రక్తపు మడుగుల్లో చనిపోవడంతో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ‘రమేశ్ గన్ ప్రాక్టీస్కు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద తుపాకీని క్లీన్ చేశాడు. ఈక్రమంలో మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ ఆయన శరీరంలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఆయనను ఎవరో కాల్చి చంపారనడం అవాస్తవం’ అని NRI శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో ఆశించిన మేర వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జిల్లా వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నిన్నటి రోజున దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనే ఉన్న తిరుపతి జిల్లాలో 38.8 డిగ్రీల ఎండ కాసింది. వర్షాలు లేకపోవడం, పొడి వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.
నెల్లూరు జిల్లాలో ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ పంచాయతీలోని వడ్డిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఎవరూ లేని సమయంలో పట్టపగలే దొంగ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాను పగలగొట్టాడు. పక్కన ఇంట్లో ఉన్న మహిళ ఆ శబ్దం వినింది. దొంగను గమనించి ఆ ఇంటి బయట గడియ పెట్టింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని దళిత బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు. ఆయన చెప్పిన వివరాలను నేను ఫార్వర్డ్ చేసినందుకు నాపై కేసు పెట్టారు. A2గా నన్ను చేర్చారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని కాకాణి అన్నారు.
చిల్లకూరు మండలం, తమ్మినపట్నంలో త్వరలో జరగనున్న క్రిష్ సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఇవాళ సభాస్థలిని కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని సభ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
నెల్లూరు : జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న లక్ష ఇరవై వేలమంది మహిళలను లక్షాధికారులు చేయడమే ప్రధాన లక్ష్యంగా లక్ పతి దీదీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో ఉన్న పొదుపు సంఘాల మహిళలను గుర్తించి వారికి అవసరమైన జీవనోపాధిని కల్పిస్తామని తెలియజేశారు.
కావలిలో రియల్ ఎస్టేట్ మాఫియా 123 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించుకుంది వాస్తవమేనని కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు కిషోర్ బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దొంగ సర్వే నెంబర్లతో అమ్ముతున్నారని అన్నారు. కావలి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.