India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా KHOJ టూల్, సైబర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా. అజిత వేజెండ్ల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఛాంపియన్ ఫార్మర్ ఎంపిక చేసి, వ్యవసాయంలో నూతన విధానాల అమలు ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. యాంత్రీకరణపై జరిగిన వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు.

తిరుమల శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళగానే జగన్మోహనకారాన్ని చూస్తూ బాహ్యప్రపంచాన్ని మర్చిపోతారు భక్తులు. ప్రధానాచార్యుల తపోబలం, యోగబలం, సంప్రోక్షణ ముహూర్త బలం వల్ల సకలదేవతలు స్వామిచుట్టూ కొలువై ఉండటమే ఇందుకు కారణమని పండితులు చెబుతున్నారు. దేవతల దివ్యశక్తి నిత్యం ఆలయంలో ప్రవహిస్తూ ఉంటడంతో విమాన ప్రాకారంలోకి ప్రవేశించిన భక్తుల మనసు ఏకాగ్రతం అవుతుంది. బంగారు వాకిలి దాటగానే బాహ్యప్రపంచంలోకి అడుగు పెడతారట.

ఇప్పటికే అక్టోబర్ వచ్చేయడంతో రైతులు సాగుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకొనే పనుల్లో ఉన్నారు. 2024-25 ఏడాదిలో రూ. 286.90 లక్షలు మంజూరు చేయగా.. 151 రొటీవెటర్లు, 569 కల్టివేటర్లు, 482 స్ప్రేయర్లు, 73 గుంటకలు, 53 హాఫ్ కేజీ వీల్స్, 62 బ్రష్ కట్టర్లు తోపాటు మొత్తం 1447 పరికరాలను 50% సబ్సిడీతో సరఫరా చేశారు. మరీ ఈ సీజన్కు ఏమాత్రం కేటాయింపులు ఇస్తారో చూడాలి.

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. నేడు సీఎం చంద్రబాబు అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కు రూ.15 వేలు నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో నెల్లూరు రూరల్ -3441, నెల్లూరు అర్బన్ -1821, సర్వేపల్లి -2651, కోవూరు -2585, కావలి -1888, ఆత్మకూరు -1636, ఉదయగిరి -1406, కందుకూరు -1004, వెంకటగిరి -974 మందిని లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు.

జిల్లాలో 85 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించామన్నారు.

చిన్నారులకు ఆట, పాటలతో సాగాల్సిన విద్యాబోధన నీరుగారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2934 అంగన్వాడీ కేంద్రాల్లో 45,999 మంది పిల్లలు ఉన్నారు. చాలా కేంద్రాల్లో ఆట వస్తువులు ఉండకపోగా, ఉన్నవి కాస్త విరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆట వస్తువులు లేక నోటి మాటలతోనే బోధన సాగిస్తున్నారు. గతంలో ఇచ్చినవే అరకొరగా ఉన్నాయి తప్పితే.. కొత్తగా మంజూరు చేయలేదు. ఇకనైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కింద నెల్లూరు జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల్లో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (Reduce–Reuse–Recycle)లో అవార్డులు వచ్చాయన్నారు. sasa.ap.gov.in ద్వారా అవార్డు గ్రహీతల వివరాలు తెలుసుకోవచ్చు. ఈనెల 6న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరిని సన్మానిస్తారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన క్రీడాకారులు టెన్నిస్ బాల్ T10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్కు భారత్ తరఫున ప్రకాశ్, నాగేంద్ర ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు థాయిలాండ్ జరగబోయే సెకండ్ ఏసియన్ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు ఒరిస్సాలో సెప్టెంబర్ 9న జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచారు.

జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనుల మరమ్మతులపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికి పైగా నీటితో నింపాలన్నారు.
Sorry, no posts matched your criteria.