Nellore

News August 26, 2024

సూళ్లూరుపేట: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు వివరించారు.

News August 26, 2024

వెంకటగిరి: అధికారుల చేతివాటం.. 12 మంది సస్పెండ్

image

వైసీపీ హయాంలో ఉపాధిహామీ పథకంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయిలో స్థానికంగా ఉండే అర్హుల జాబ్ కార్డుల్లో.. అక్కడ లేని వారి పేర్లు చేర్చి రూ. లక్షలు కాజేశారు. ఏడుగురు క్షేత్రసహాయకులు, ఒక మేట్, ముగ్గురు టీఏలు, ఈసీలపై మొత్తం 12 మందిపై వేటు వేసినట్లు ఎంపీడీవో గోవర్దన్ తెలిపారు

News August 26, 2024

కృష్ణాష్టమి ప్రజలందరి జీవితంలో శాంతిని నింపాలి: మంత్రి

image

భక్తితో నిండిన ఈ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి నింపాలని ఆ శ్రీ కృష్ణుడి అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఆయ‌న శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రాముఖ్యత ఉంటుందన్నారు.

News August 25, 2024

ఉదయగిరి కొండపై మంటలు (PHOTO)

image

ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం కొండపై ఆదివారం రాత్రి మంటలు వచ్చాయి. వన్య ప్రాణులకు ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వన భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ పడేసి ఉంటారని లేదా పొయ్యి వెలిగించి చల్లార్చకపోవడంతో మంటలు వచ్చి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News August 25, 2024

కోడి పందేలు.. 19 మందిపై కేసులు

image

పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం అడవుల్లో కోడి పందేల శిబిరంపై ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం దాడి చేశారు. 10 బైక్‌లు, 17 ఫోన్స్, 2 కోడి పుంజులతో పాటు రూ.3,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కోడి పందేలు, పేకాట ఆడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

News August 25, 2024

నెల్లూరు వైసీపీ నేతకు కీలక పదవి

image

నెల్లూరు నేతకు మాజీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. తాజాగా వైసీపీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకే జగన్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు, వైసీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

News August 25, 2024

NLR: పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రభుత్వ పాఠశాలల HMలు, టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీవీజే రామారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ సాయంత్రంలోగా ఉప, మండల విద్యా శాఖాధికారుల ద్వారా డీఈవో ఆఫీసుకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు  జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు.

News August 25, 2024

నెల్లూరు: బాలికను గర్భిణీని చేసి.. బెదిరింపులు

image

కావలిలో పట్టణానికి చెందిన బాలిక(14) దర్శి(M) రాజంపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు వరుణ్ సాయితో పరిచయమైంది. ఇది ప్రేమగా మారి దగ్గరయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రలు నెల్లూరులో పరీక్షలు చేయగా ఆమె 7 నెలల గర్భిణీ అని తేలింది. ఈనెల 18న కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌పై పోక్సో కేసు నమోదైంది. కేసు వెనక్కి తీసుకోకపోతే యాసిడ్ పోసి తగలబెడగానని బాధితులను వరుణ్ భయపెడుతున్నాడు.

News August 25, 2024

అమెరికాలో మేనకూరు డాక్టర్ మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డాక్టర్ అమెరికాలో చనిపోయారు. నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన పేరంశెట్టి డాక్టర్ రమేశ్ బాబు(64) అమెరికాలో ఎన్నో ఆసుపత్రులు నిర్మించి సేవలు అందించారు. టస్కలూసా ప్రాంతంలో మంచి డాక్టర్‌గా పేరుపొందారు. శుక్రవారం సాయంత్రం తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా.. ఘటన ఎలా జరిగిందో తెలియరావడంలేదు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఆయన చదివారు.

News August 25, 2024

నగరవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

image

వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న నగరవనాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నగరవనాన్ని దేశంలోనే నెంబర్ 1 నగరవనంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. నెల్లూరు ప్రజలు కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా గడిపే విధంగా ఈ నగరవనాన్ని రూపుదిద్దుతామని ఆయన తెలిపారు.