Nellore

News March 20, 2025

నెల్లూరు: 10 మంది టీచర్లు సస్పెండ్

image

Open 10th Examsలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్‌ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్‌ కాపీయింగ్‌ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.

News March 20, 2025

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నెల్లూరు జిల్లా వాసి

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2025

నెల్లూరు: గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి

image

నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ సుకన్య బుధవారం గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

News March 20, 2025

మంత్రివ‌ర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

image

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చ‌ర్చ సాగింది.

News March 19, 2025

మంత్రివ‌ర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

image

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చ‌ర్చ సాగింది.

News March 19, 2025

ప్రైవేట్ బ్యాంక‌ర్లు భాగ‌స్వామ్యం కావాలి: నెల్లూరు జేసీ

image

ఎంఎస్‌ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ కె కార్తీక్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడారు.

News March 19, 2025

తెడ్డుపాడు హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

దుత్తలూరు మండలం తెడ్డుపాడు – నర్రవాడ జాతీయ రహదారి ప్రాంతంలో రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేశ్ ( 32 )అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌పై వస్తున్న సురేశ్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

News March 19, 2025

కోడూరు బీచ్‌లో షూటింగ్ సందడి..!

image

తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ తీరంలోని వేళాంగిణి మాత ఆలయం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. చిత్ర యూనిట్ భక్తి సంబంధమైన “అసుర సంహారం” సినిమా చిత్రీకరణ చేపట్టారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్రం నిర్వాహకులు మాట్లాడుతూ”అసుర సంహారం” ప్రధాన ఘట్టాలు నెల్లూరు జిల్లాలో చిత్రీకరిస్తున్నారన్నారు.

News March 19, 2025

నెల్లూరు: ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిచి హత్య

image

నెల్లూరు పొద‌ల‌కూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మ‌ధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హ‌త్య చేశారు.

News March 19, 2025

నాదెండ్లతో నెల్లూరు నేతల భేటీ

image

మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.