Nellore

News September 27, 2025

DSC జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపండి: DEO

image

2025 DSC ఎంపిక జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో అభ్యంతరాలు ఫిర్యాదులు ఉంటే అక్టోబర్ 25వ తేదీల్లోగా జోన్, రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్‌లో తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అవకాశం ఉందన్నారు.

News September 27, 2025

నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

నేటి నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి కోత కోసే ప్రతి గ్రామంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ – ఏ పుట్టి రూ. 20,306, సాధారణ రకం పుట్టి రూ. 20,136 ప్రభుత్వ మద్దతు ధరగా ప్రకటించినట్లు తెలిపారు.

News September 26, 2025

బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో : కాకాణి

image

అభిమానులను కొడుతూ, తిడుతూ ఉన్మాదిలా ప్రవర్తించే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌పై అయన మాట్లాడిన మాటలు వింటుంటే, పిచ్చి మళ్లీ ముదిరిందా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే అనుమానం కల్గుతుందన్నారు. బాలకృష్ణ మాట్లాడినవన్నీ అబద్దాలని చిరంజీవి వివరణ రుజువైందని X లో కాకాణి పోస్ట్ చేశారు.

News September 26, 2025

42192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు : నోడల్ ఆఫీసర్

image

స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 490 వైద్య శిబిరాలు నిర్వహించి 42,192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు ఆ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ స్టేఫీ తెలిపారు. వరిగొండ, దామర మడుగులలో జరుగుతున్న వైద్య శిబిరాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈకార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.

News September 26, 2025

గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలకు అనుమతి లేదు: SI అంకమ్మ రావు

image

ఉలవపాడు మండలం బద్దిపూడిలో గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెల 27 నుంచి జరిగే ఉత్సవాలకు అనుమతులు నిలిపివేసినట్లు SI అంకమ్మరావు గురువారం తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత గ్రామ పెద్దలు, ప్రజల ఏకాభిప్రాయంతో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చున్నారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News September 25, 2025

ఇంటర్ పరీక్షా ఫీజును చెల్లించండి: ఆర్‌ఐఓ

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజును అక్టోబర్ 10వ తేదీలోపు చెల్లించాలని ఆర్ఐఓ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చునని, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ నిర్ణీత తేదీలోపు పరీక్షా ఫీజులు చెల్లించాలని, ఈ విషయాన్ని అన్ని కళాశాలలు గమనించాల్సిందిగా కోరారు.

News September 25, 2025

ఓటర్ల జాబితా పారదర్శకంగా జరుగుతుంది : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం-6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం-6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

News September 25, 2025

నెల్లూరులో రేషన్ అక్రమాలకు చర్యలు: మంత్రి

image

నెల్లూరు జిల్లాలో PDS రైస్ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఒక చెకోపోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మంత్రి మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.234 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వరుసగా పీడీఎస్ రైస్ బయట ప్రాంతాలకు తరలి వెళ్తుండగా అధికారులు సీజ్ చేస్తున్నారు.

News September 25, 2025

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

అక్టోబర్ 31వ తేదీ వరకు ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు నెల్లూరు DEO డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. ప్రవేశాల రిజిస్ట్రేషన్ కొరకు జిల్లాలోని ఆయా గ్రామం వార్డు సచివాలయాలు, ఏపీ ఆన్లైన్ కేంద్రాలలో ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8919428319 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News September 25, 2025

అక్టోబర్ 15 లోగా పంచాయతీల విభజనకు కసరత్తు

image

అక్టోబర్ 15వ తేదీలోగా పంచాయతీల విభజనకు కసరత్తు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీల విభజనకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ఎంపీడీవోలు, డీఎల్పీఓ ప్రతిపాదనలు సిద్ధం చేసి డీపీఓ కార్యాలయాన్ని పంపించాలన్నారు.