India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్కు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండల పరిధిలోని ముసునూరు పంచాయతీ కొత్త గుంట నీటిలో గుర్తుతెలియని 15 నెలల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విలేజ్ రెవెన్యూ అధికారి సమక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే 0861- 2943569 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చని నెల్లూరు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇసుక డిపోలలో నిల్వలు తగ్గిపోతున్నందున టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలన్నారు.
మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో శనివారం జరిగిన స్వర్ణ భారత్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు వీడ్కోలు పలికారు. వీరితో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్లారు. వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా అధికారులు కూడా ఉన్నారు.
ఎక్స్ట్రా ట్రిట్మెంట్ చేయించడానికి డబ్బులు సరిపోవడంలేదని, ఎవరైన హెల్ప్ చేయాలని నెల్లూరుకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి మంత్రి నారాలోకేశ్ స్పందించారు. అతడిని మేం చూసుకుంటాం. నా బృందం వారిని చేరదీస్తుంది అమ్మా! అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ఒ. ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉన్నారు.
రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు ఘన స్వాగతం లభించింది. ముందుగా ఉపరాష్ట్రపతి దంపతులకు మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బ రాయుడు, జేసీ శ్రీ శుభం బన్సల్, కమిషనర్ ఎన్.మౌర్య, MLC డా.సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డా.శిరీష తదితరులు స్వాగతం పలికారు.
ఏఎస్ పేట మండలం చందలూరుపాడులో మహారాష్ట్రకు చెందిన యువకుడు ఉన్నాడు. ఆ గ్రామ పొలాల్లో నాలుగు రోజులుగా తిరుగుతుండగా గ్రామస్తులు చూసి అతనిని గ్రామంలోకి తీసుకువచ్చారు. కొంచెం మతిస్థిమితం లేనివిధంగా మాట్లాడుతున్నాడని గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలపడం లేదు. అతని బంధువులు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని తీసుకుపోవాలని గ్రామస్థులు తెలుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.