India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
✒ అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
✒ పొదలకూరు : రావి ఆకుపై నెలవంక. మసీదు చిత్రం
✒ మిస్ నెల్లూరు-2025గా విజేతగా HONEY PRIYA
✒నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?
✒ సోమశిల: నిషేధిత వలలతో జీవనోపాధి కోల్పోతున్న స్థానిక జాలర్లు
✒ నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి
✒ పశువుల కాపర్లపై చేజర్ల SI దాడి.?
నెల్లూరులోని ఓ కార్యక్రమానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విచ్చేసి సందడి చేశారు. అనంతరం ఆమె ‘దిల్ దివానా’ ఫేమ్ హీరో రోహిత్ రెడ్డిని స్నేహపూర్వకంగా కలిశారు. సినీ రంగానికి సంబంధించి పలు అంశాల గురించి వారు మాట్లాడుకున్నారు.
వలేటివారిపాలెం(M), అయ్యవారిపల్లి గ్రామ భూమి రికార్డులలో ఓ చిత్రమైన పరిస్థితి వెలుగు చూసింది. కనీసం రూ.1000 కోట్లు విలువ చేసే దాదాపు 6500 ఎకరాల ప్రభుత్వ భూమి ఏ శాఖది అన్న ప్రశ్న తలెత్తింది. Sno: 4, 118 కి సంబంధించిన FMB ప్రకారం కొండలు, గుట్టలు, అడవితో కూడిన 8155 ఎకరాల భూమి ఉంది. గణాంక వివరాలు తెలిపే FLR లో 1656 ఎకరాలు మాత్రమే అటవీభూమిగా ఉంది. మిగిలిన భూమి ఎవరిది.? అనేందుకు రికార్డు లేనట్లు సమాచారం.
అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, మీ అమౌంట్ రెట్టింపు చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీ సమాచారం చెప్పవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్కు లేదా, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.
నెల్లూరు నగర శివారులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని మండల పరిషత్ పాఠశాలకు సంబంధించిన సమస్యలను HM, విద్యార్థులు మంత్రికి ఏకరువు పెట్టారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి విశాలంగా ఉన్న పాఠశాల మైదానంలో ఆట వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ మంత్రి నారాయణ పాఠశాలలో వాటికి శంకుస్థాపన చేశారు.
క్షణికావేశంలో ఓ మహిళ తన 7 నెలల పాపతో సహా ఆత్మహత్యకు యత్నించిన వారిని చిన్న బజార్ పోలీసులు రక్షించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని ఓ మహిళ నుంచి 112 నంబర్కు కాల్ వచ్చింది. వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని కాపాడి సీఐ కోటేశ్వరరావు కౌన్సెలింగ్ చేశారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ కోటేశ్వరరావు అభినందించారు.
నెల్లూరు జిల్లాలో 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) శనివారం రూ.87,650కు చేరినట్లు పసిడి వ్యాపారులు తెలిపారు. శుక్రవారం రూ.88,730వేలుగా ఉన్న ధర.. నిన్న స్వల్పంగా తగ్గింది. నెల్లూరులో గత నెల 25న రూ.89,500తాకిన బంగారం ధర క్రమంగా తగ్గుతున్నట్లు వారు తెలిపారు.
గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెంకు చెందిన 30 మంది మహిళా కూలీలు ఆదివారం పొన్నలూరు మండలం ఎదురువారిపాలెంలో శనగ కోతకు ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో పొన్నలూరు, నాగిరెడ్డి పాలెం మధ్యలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం 108 వాహనంలో కందుకూరుకు తరలించారు.
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ ధర దాదాపు రూ.111గా ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.80గా ఉంది. స్కిన్లెస్ ధర. రూ.220గా ఉండగా, బ్రాయిలర్ చికెన్ ధర రూ.200గా ఉన్నట్లు సమాచారం. లేయర్ చికెన్ ధర రూ.136గా ఉంది. బర్డ్ ఫ్లూ భయంతో తగ్గిన కొనుగోళ్లు ఇప్పుడు కాస్త పెరిగాయని వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
వ్యవసాయ బడ్జెట్పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇది వ్యవసాయం రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్ అన్నారు. ఆశలు పెట్టుకున్న రైతులకు నయ వంచన తప్ప మరేమీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో మరోసారి రైతు దగా పడ్డారన్నారు. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించడంతో రైతులు మద్దతు ధర మీద ఆశలు వదిలేయాల్సిందేనన్నారు.
Sorry, no posts matched your criteria.