India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా నియామకాలు జరిగాయి. నిన్న కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో పలువురు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారిక నియామకాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని.. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు.
నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా మల్లికార్జున్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొండాయపాలెం గేటు వద్ద ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఆ స్థానం ఖాళీగా ఉండడంతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి PBN పరిమళ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ POను నియమించడంతో ఆ స్థానం భర్తీ అయ్యింది. ఈ మేరకు మల్లికార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరూ ఉండకూడదని, అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు చేయడమే లక్ష్యంగా పీఎమ్ఏవై 2.0 డిమాండ్ సర్వేను వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇల్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా అప్కాస్ రద్దు, ప్రైవేటు ఏజెన్సీ వద్దని, తమను పర్మినేoట్ చేయాలని కోరుతూ సోమవారం కార్మికులు పోస్ట్ కార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. సీఐటీయూ నేత పి.పెంచలయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రైవేటు కాంట్రాక్టులో ఉన్నప్పుడు కార్మికులు జీతాల కొసం ఇబ్బందులు పడ్డారన్నారు. మళ్లీ సీఎం ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మంచిది కాదని అన్నారు.
పులివెందులలో ఓడిపోతాననే భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని MLA సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే భయం జగన్కు ఉందని, అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడే లేదన్నారు. ఓ వైపు జగన్, మరోవైపు కాకాణి పదే పదే బట్టలిప్పుతాన్నంటున్నారని హో మంత్రి వారి మీచ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ అన్న సోమిరెడ్డి.. ఆయనకు దురాశ పనికి రాదని ఎద్దేవా చేశారు.
భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్గా భార్య సుమాంజలి నర్స్గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎగ్జామ్స్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మొత్తం 7 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 86.4% మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4102 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3546 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 556 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.
నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.
బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.93 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.190గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.