Nellore

News February 28, 2025

నెల్లూరుకు ప్రముఖ సింగర్స్ రాక

image

కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ ఉదయ కాళేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి గొప్ప సంగీతవిభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ సునీత, సమీర భర్వదాజ్, హారికానారాయణ్ లతో జబర్దస్త్ టీం పాల్గొని సందడి చేయనుంది.

News February 28, 2025

నెల్లూరు: నాడు ప్రేమ పెళ్లి సంచలనం.. నేడు విషాదం

image

రెండేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా సంచలన రేపిన ప్రేమ వివాహం నేడు విషాదంతో ముగిసింది. పొదలకూరు(M), మర్రిపల్లికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు రూరల్‌కి చెందిన నాగ సాయి అనే యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆ వివాహం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివప్రియ ఆత్మహత్య చేసుకుంది. భర్త నాగసాయి పోలీసులకు తెలియజేశారు.

News February 28, 2025

నెల్లూరు: పదో తరగతి విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం FREE

image

పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని DEO బాలాజీ రావు తెలిపారు. మనుబోలు మండల కేంద్రంలోని MEO కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 33,400 మంది విద్యార్థులు మార్చి 15 నుంచి పరీక్షలు రాస్తారన్నారు. వారు ఉచితంగా పరీక్షా కేంద్రానికి బస్సుల్లో వెళ్లవచ్చన్నారు. జిల్లాలో పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News February 28, 2025

నెల్లూరుకి కేంద్రం బాధ్యతను అప్పగించింది : వీసీ

image

వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025ను జిల్లా స్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ, ఎన్ఎస్‌ఎస్‌, నెల్లూరు నెహ్రూ యువ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025 కు సంబంధించిన గోడ ప్రతులను  ఆవిష్కరించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.

News February 27, 2025

నెల్లూరుకి కేంద్రం బాధ్యతను అప్పగించింది : వీసీ

image

వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025ను జిల్లా స్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ, ఎన్ఎస్‌ఎస్‌, నెల్లూరు నెహ్రూ యువ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025 కు సంబంధించిన గోడ ప్రతులను  ఆవిష్కరించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.

News February 27, 2025

నోరుంది కదా అని వాగితే పోసాని గతే: MLA సోమిరెడ్డి

image

నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుందో పోసాని ఉదంతమే నిదర్శమని MLA సోమిరెడ్డి తెలిపారు. పోసాని అరెస్టుపై స్పందిస్తూ.. ఈ ఘటనను తెలుగు ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్‌పై ఆయన వాడిన భాషకు 111 సెక్షన్ చాలదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఓ డైరెక్టర్‌ను మాత్రం అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.

News February 27, 2025

Way2News ఎఫెక్ట్: గండిపాలెం గురుకులానికి అధికారుల పరుగులు 

image

ఉదయగిరి(M) గండిపాలెం గురుకులంలో 23న విద్యార్థులతో <<15553238>>వంటపనులు<<>> చేయిస్తున్న అంశంపై Way2Newsలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు, జునైల్ కోర్టులో ఫిర్యాదు, AP కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరా, బాలల సంరక్షణ కమిషనర్ విచారణ చకచకా జరుగుతున్నాయి. బాలల హక్కుల కమిషనర్ ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక కోరింది. మరి విద్యార్థులకు న్యాయం దక్కేనా.?

News February 26, 2025

శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: నెల్లూరు SP

image

నేడు(బుధవారం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో భక్తులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు.

News February 26, 2025

నెల్లూరులో శివ‌రాత్రి శోభ‌.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

image

మహాశివ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని, నెల్లూరులోని శైవ‌క్షేత్రాలన్నీ విద్యుత్ కాంతుల‌తో ముస్తాబ‌య్యాయి. బుధ‌వారం శివ‌రాత్రి సంద‌ర్భంగా న‌గ‌రంలోని మూలాపేట, న‌వాబుపేట‌, గ‌ణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి త‌దిత‌ర శైవ క్షేత్రాల‌లో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

News February 26, 2025

భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి 

image

రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్దీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.