Nellore

News February 19, 2025

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 9వ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. తాను 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 3 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 8 కేంద్రాలను చెక్ చేసిందన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు. 51 మంది ప్రాక్టికల్స్‌కు రాలేదన్నారు.

News February 19, 2025

నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 18, 2025

నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

image

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

News February 18, 2025

నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 18, 2025

నెల్లూరు: సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

image

సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతైన ఘటన TP గూడూరు(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామానికి చెందిన కే.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి తీరానికి చేరుకోలేదు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకూరుపేట(M), కొరుటూరు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చింది. తోటపల్లి గూడూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

News February 18, 2025

అనుమతి ఉన్న లేఅవుట్లనే కొనండి: మంత్రి నారాయణ

image

అనుమతి ఉన్న లే అవుట్ల వివరాలను సంబంధిత వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని, వాటినే కొనుగోలు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా సడలించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

News February 17, 2025

10వ తరగతి పరీక్షలపై డివిజన్ స్థాయిలో సమీక్ష

image

10వ తరగతి పరీక్షలపై 19, 20 తేదీల్లో డివిజన్ స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై 19 వ తేదీన కందుకూరు, కావలి డివిజన్లకు, 20వ తేదీన నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు ఆయా ప్రాంతాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంటల్‌, చీఫ్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

News February 17, 2025

నెల్లూరు: బాలుడిపై లైంగిక దాడి

image

బాలుడి(10)పై మరో బాలుడు(17) లైంగికదాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. దుత్తలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిని ఎస్ఐ ఆదిలక్ష్మి ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. కావలి డిఎస్పీ శ్రీధర్, సీఐ వెంకట్రావు విచారణ జరిపారు. లైంగిక దాడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2025

నెల్లూరు: చెల్లిని చూసేందుకు వెళ్తూ.. అన్న స్పాట్ డెడ్

image

చెల్లిని చూసేందుకు వెళ్లిన అన్న రోడ్డుప్రమాదంలో మృతి చెందిన ఘటన మనుబోలు(M), కొమ్మలపూడి సమీపంలో జరిగింది. ఏర్పేడు(M), బండారుపల్లికి చెందిన రాజేశ్ (35), తన ఫ్రెండ్ మునిశేఖర్‌తో కలిసి చెల్లిని చూసేందుకు బైకుపై నెల్లూరు నుంచి గ్రామానికి వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈఘటనలో రాజేశ్ దుర్మరణం చెందగా, మునిశేఖర్‌ తీవ్రంగా గాయపడగా గూడూరుకు తరలించారు. SI శివ రాకేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2025

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆనం ఆవిష్కరణ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆత్మకూరు పట్టణ సమీపంలోని తిరునాళ్ల తిప్ప వద్ద శ్రీ కాశినాయన ఆశ్రమంలో ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రావాలని ఆలయ కార్యనిర్వాహకులు కోరారు.

error: Content is protected !!