India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేడు మంత్రి సత్యకుమార్ యాదవ్ను నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందచేసారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి నూతన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.
వాకాడు మండల జనసేన పార్టీ నేత రౌతు శివకుమార్పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండంలోని ఓ పార్టీకి చెందిన నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయాలన్నారు.
నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సహచర మంత్రి పొంగురు నారాయణతో కలిసి పాల్గొన్నాను. ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించాం. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి సత్వర పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం’ అని ‘X’ ట్విట్ చేశారు.
చనిపోయిన భార్యపై ప్రేమను భర్త వినూత్నంగా చాటుకున్నారు. వెంకటగిరికి చెందిన భక్తకవి పెనగలూరి కుమార్ భార్య భూషణమ్మ గతేడాది మరణించారు. దీంతో భార్య జ్ఞాపకార్థం ఆమె సంవత్సరికం సందర్భంగా శిలా విగ్రహాన్ని తన స్వగృహంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. భార్యపై తనకున్న ప్రేమ అమూల్యమైనదని చాటి చెప్పారు.
నెల్లూరు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ టీడీపీ మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలను వరుసగా కలుస్తుండడంతో పార్టీ మారతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అరుణమ్మ వైసీపీ మద్దతుతో ZP ఛైర్ పర్సన్ పదవి చేపట్టారు. అయితే జడ్పీ సమావేశాలకు మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో ఆయన క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేత, కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ భేటీ అయ్యారు. వారు పలు విషయాలపై చర్చించారు. ZP సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు ఆనం దంపతులు తెలిపారు. మంత్రి నారాయణతో వారు భేటీ కావడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. గత 4 రోజులుగా అత్యధికంగా రూ.90 నుంచి రూ.100 పలికాయి. గురువారం రూ.100పైగా అమ్ముడుపోవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. బస్తా లూజు మొదటి రకం KG రూ.100 నుంచి రూ.130 చొప్పున, రెండో రకం KG రూ.60 నుంచి రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. శ్రావణమాసంలో దక్షిణ ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేయడంతో నిమ్మధరలు పెరిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీ జి.కృష్ణకాంత్ను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా శాంతి భద్రతలపై వారు చర్చించారు. ఆమె వెంట నెల్లూరు జిల్లా మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్ ఆనం విజయకుమార్ రెడ్డి ఉన్నారు.
గూడూరులోని ఆర్టీసీ కార్యాలయం వద్ద నేడు NMUA ఆధ్వర్యంలో పలువురు నేతలు ధర్నా చేశారు. ఆ సంస్థ స్టేట్ సెక్రటరీ చెంచులయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల డిపో మేనేజర్లు అనుచితంగా వ్యవహరిస్తున్నారని, వారిని వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను మానుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.
ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ పరిధిలోని దర్గామిట్టలోని ఓ ఇంట్లో సుమారు 2.3 లక్షల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా వేంకటేశ్వర పురంలోని విజయ డెయిరీ మాజీ ఉద్యోగి గోళ్ళ సుబ్బారావు ఇంట్లో బంగారం, వెండి, నగదు మొత్తం కలిపి రూ.10 లక్షల విలువ గల సొత్తు చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.