Nellore

News August 7, 2024

నెల్లూరు జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధి

image

కేంద్ర ప్రభుత్వానికి చెందిన లక్బద్ దీది కార్యక్రమం ద్వారా జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ సాంబశివారెడ్డి పేర్కొన్నారు. ఏజీఎంలు, ఏపీఎంలు, ఏసీలు, సీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లక్బద్ దీదీ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించాల్సి ఉందన్నారు.

News August 6, 2024

సీతారాంపురం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

సీతారాంపురంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గారపాటి చెన్నకేశవులు (42) మృతి చెందారు. సీతారాంపురంలోని కోట వీధిలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు ఓ ఇంటి వద్ద కరెంటు పనిచేసేందుకు వెళ్లాడు. అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం లైన్ మార్చే క్రమంలో షాక్‌కు గురై అక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.

News August 6, 2024

నెల్లూరు: OBC విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బీద ప్రశ్న

image

మెడికల్ కౌన్సెలింగ్‌లో ఓబీసీలకు అన్యాయంపై పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. OBC విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వ్ చేయబడిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, ఎయిమ్స్ లో మెడికల్ సీట్లను భర్తీ చేసేటప్పుడు డిజిహెచ్‌ఎస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా జరిగిన అన్యాయంపై మంగళవారం రాజ్యసభలో జీరో అవర్ లో బీద మస్తాన్‌రావు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News August 6, 2024

నెల్లూరు: ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

image

నెల్లూరు నగరం ఆకు తోటలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం రాత్రి మద్యం దుకాణంలోకి ప్రవేశించి సుమారు రూ.2.80 లక్షలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా చోరీల పరంపర సాగుతుంది. పోలీసులు బదిలీలు, నియామకాల్లో బిజీగా ఉండగా దొంగలు చోరీల్లోనూ బాగా బిజీ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి

News August 6, 2024

నెల్లూరులో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

image

దివ్యాంగురాలిపై అత్యాచారానికి యత్నంచిన ఘటన విడవలూరులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు(17) తల్లిదండ్రులు చనిపోవడంతో తాత వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన Y శీనయ్య అత్యాచారానికి యత్నించాడు. దివ్యాంగురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సాయిప్రసాద్ తెలిపారు.

News August 6, 2024

నెల్లూరు: నగదు మోసాలపై ఫిర్యాదుల వెల్లువ

image

జిల్లాలో నగదు మోసాలే అధికంగా జరుగుతున్నాయి. ఉమేష్ చంద్ర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 119 మంది వారికి జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో రూ. 12 కోట్ల విరాళం ఇస్తామని రూ.18 లక్షలు కాజేసారని, స్నేహితులతో భాగస్వామిగా ఉన్న కంపెనీలో కుమారుడు చనిపోతే డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు, రూ.8 లక్షలకు పసుపు అమ్మితే డబ్బులు ఇవ్వడంలేదని ఫిర్యాదులు వచ్చాయి.

News August 6, 2024

నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడిగా కాకాణి !

image

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అప్పజెబుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం ఆయన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలవడం ఇందుకు బలం చేకూరుతోంది. అధ్యక్ష పదవికి కాకాణి జిల్లా వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి రాష్ట్ర పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News August 6, 2024

13న శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్ రాక

image

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్సేస్ సెంటర్ షార్(శ్రీహరికోట)కు ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇస్రో ఆధ్వర్యాన గత నెల 14 నుంచి ఈ నెల15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమాలు జరిపారు. షార్ వేదికగా ఈనెల 13న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరుకానున్నారు.

News August 6, 2024

నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. పొక్సో కేసు

image

నాయుడుపేట పట్టణంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన చేపల అక్వేరియం దుకాణ యజమాని షేక్ నౌషాద్ పై పోలీసులు పొక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. చిన్న దర్గా వీధిలో ఉంటున్న అక్వేరియం షాప్ వద్దకు వచ్చిన మైనర్ బాలికకు తినుబండరాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఓ పాఠశాల ఆవరణంలో తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 6, 2024

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో నెల్లూరు కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పరిధిలోని పలు అభివృద్ధి పనులు పెండింగ్ కార్యక్రమాల గురించి ఆయన కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.