India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరి మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఓ మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరొకరు వైద్యం పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంకటగిరి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు కుమ్మరి వాళ్ల ఇంట ప్రతిమ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు తొలిపూజ చేశారు. మరికాసేపట్లో అమ్మవారిని జీనిగల వారి వీధిలోని చాకలి మండపానికి తీసుకెళ్లనున్నారు. అక్కడే దిష్టి చుక్క, కళ్లు పెడుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా అమ్మవారి ప్రధాన ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం నిమజ్జనం జరగనుంది.
27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు(D)లోని ఆ శాఖా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన వీడియోల పోటీలకు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. చూడదగిన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఈకో-టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహించేలా సృజనాత్మకత ఉన్న వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లకు 20వ తేదీలోపు సంప్రదించాలన్నారు.
దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కదలిక వచ్చింది. మొదటి దశ పనులను PPP విధానంలో చేపట్టేందుకు ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్ను ఆహ్వానించింది. దీని కోసం నవంబర్ 10న ఫ్రీ బిడ్ కాన్ఫరెన్స్ను నిర్వహించనుంది. ఈ నిర్మాణానికి 2016లోనే TDP ప్రభుత్వం 13 వందల ఎకరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సైతం రావడంతో ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు వాసులకు అన్నీ విధాలా లబ్ధి చేకూరనుంది.
నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్గా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఆయనకు ప్రమోషన్ ఇచ్చి నెల్లూరుకు బదిలీ చేసింది.
సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 70 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులకు సమాచారం చేరవేశారు. 11వ తేదీ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డ్యాంకు ప్రవాహం కొనసాగుతోంది.
నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల రేషన్ డీలర్స్కు ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మిషన్లను నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో అందజేశారు. వీటి ద్వారా సరుకులను సులభతరంగా ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గతంలో బటన్స్ నొక్కి ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు. కొత్త మిషన్లకు టచ్ స్క్రీన్ ఇవ్వడంతో నంబర్లను ఎంటర్ చేసేందుకు సులువుగా ఉంది. డివిజన్ పరిధిలో 300 వరకు మంగళవారం అందించినట్లు చెప్పారు.
వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా పెట్టే నైవేద్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపాకు అంటు వ్యాధులు ప్రబలకుండా వైరస్ను నివారిస్తుంది. సొంటి అన్నం వల్ల కడుపు శుద్ది చేయడంతో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. కుడుములు వల్ల ఊపిరితిత్తులు, కండరాలు, నరములకు శక్తి లభిస్తుంది. మునగాకు వల్ల జీర్ణశక్తి, జాయింట్ పెయిన్ రిలీఫ్కి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది.
ఉదయగిరి అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా రేషన్ షాపు మిషన్లో, అంగన్వాడీ యాప్లలో స్టాకు వచ్చినట్లు ఉన్నా తమకు సరుకులు రాలేదంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారన్నారు. కొన్నిచోట్ల నూనె, కందిపప్పు ఇవ్వాలంటూ డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సాధించి పరిష్కరించాలని కోరుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.