Nellore

News April 14, 2025

అంబేడ్కర్ చిరస్మరణీయులు: సోమిరెడ్డి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయులని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సెంటరులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలసి పాల్గొన్నారు. మొదట వసతి గృహ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు సౌకర్యాలపై ఆరా తీశారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

News April 14, 2025

రాపూరు హైవేపై ఘోరం.. ఇద్దరి మృతి 

image

కారు ఇద్దరు రైతులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డ ఘటన రాపూరులోని‌ తిక్కనవాటిక పార్కు వద్ద సోమవారం చోటుచేసుకొంది. పార్కు వద్ద ప్రధాన‌ రహదారిపై ఇద్దరు రైతులు వడ్లు ఎండబెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఓ కారు రాజంపేట వైపు నుంచి వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ(46), గార్లపాటి సురేశ్(26) అక్కడికక్కడే మృతి చెందారు.

News April 14, 2025

అందరికీ దిశానిర్దేశకులు అంబేడ్కర్: ASP

image

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి బీఆర్ అంబేడ్కర్ అని నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 14, 2025

నెల్లూరు: ప్రేయసితో గొడవ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమలో వచ్చిన గొడవలతో ఓ యువకుడు చనిపోయాడు. నెల్లూరులోని మనుమసిద్ధినగర్‌కు చెందిన రమణమ్మ, చిన్నయ్యల చిన్న కుమారుడు పోలయ్య(25) బంగారు పనిచేస్తుంటాడు. ఈక్రమంలో స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు వచ్చాయి. మూడు రోజులుగా పోలయ్య ఎవరితోనూ మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులంతా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పోలయ్య బెడ్ రూములోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

News April 13, 2025

నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

image

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 13, 2025

రూ.2.7 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే 

image

నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

News April 13, 2025

నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులకు గమనిక 

image

జోన్-3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 16లోగా తెలియజేయాలని నెల్లూరు డీఈఓ బాలాజీ రావు  తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టుల కొరకు జాబితాను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.

News April 13, 2025

ఎగ్జామ్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్ 

image

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చోసుకుంది. చింతారెడ్డిపాళెంకు చెందిన ఓ విద్యార్థి నగరంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఫలితాలలో ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్‌ తప్పాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 13, 2025

హనుమాన్ శోభయాత్ర ఏర్పాట్లపై సమీక్ష 

image

నేడు నెల్లూరులో జరగనున్న హనుమాన్ శోభయాత్ర ఏర్పాట్లు, వెళ్లే మార్గాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హనుమ భక్త శోభాయాత్ర బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ శాంతియుతంగా శోభాయాత్రలో పాల్గొనాలన్నారు. పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News April 13, 2025

మంత్రి అల్లుడి పేరుతో రూ.1.96 కోట్ల సైబర్ మోసం

image

జిల్లాలోని ఓ మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.96కోట్లు దోచేసిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 7న మంత్రి అల్లుడిని అంటూ మంత్రి సంస్థలో పనిచేసే చార్టెడ్ అకౌంటెంట్‌కు నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారు. అర్జెంటుగా రూ.1.96 కోట్లు అకౌంట్‌కు పంపాలని కోరాడు. దీంతో చార్టెడ్ అకౌంట్‌ వారి చెప్పిన అకౌంట్‌కు మనీ పంపారు. అనంతరం ఫోన్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు. 

error: Content is protected !!