Nellore

News August 3, 2024

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి ఎన్నిక

image

పార్లమెంట్ పరిధిలోని పబ్లిక్ అండర్ టేకింగ్‌ల కమిటీ ( COPU) సభ్యుడిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభాకర్ రెడ్డి కమిటీ సభ్యుడిగా సేవలు అందించనున్నారు. సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టీడీపీ కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

News August 3, 2024

నెల్లూరు: అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి

image

రాష్ట్రాభివృద్ధికి అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. హాజరైన నెల్లూరు పార్లమెంట్ స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సూచించారు. సైకో పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం నిర్లక్ష్యానికి గురయ్యి అభివృద్ధి పడకేసిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్నారు.

News August 2, 2024

ఉదయగిరి: బాత్రూంలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఉదయగిరి మండలంలో జరిగింది. గండిపాలెం గ్రామానికి చెందిన చిన్న వెంగయ్య (50) శుక్రవారం సాయంత్రం స్నానానికి బాత్రూంలోకి వెళ్లగా మరమ్మతులకు గురైన విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 108 కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వైద్య సిబ్బంది చేరుకొని పడి ఉన్న వ్యక్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.

News August 2, 2024

నెల్లూరు: టీడీపీ ప్రభుత్వంలో జగన్ ఫొటో దర్శనం

image

జలదంకి మండలం చిన్నక్రాక గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటోతో రేషన్ బియ్యం పంపిణీకే MDU ఆపరేటర్లు ఇంకా మొగ్గు చూపుతున్నారు. నూతన టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 56 రోజులు గడుస్తున్నా రేషన్ బియ్యం వాహనాలకు కొన్నింటికి ఇంకా మాజీ సీఎం ఫొటో జిల్లాలో దర్సనమిస్తున్నాయి. దీంతో మండల అధికారులకు కలెక్టర్ ఆనంద్ వాటిని వెంటనే తొలగించాలని సూచించారు.

News August 2, 2024

మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పర్వత రెడ్డి భేటీ

image

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తాడేపల్లిలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు రాజకీయ అంశాల గురించి పర్వత రెడ్డితో ముచ్చటించారు.

News August 2, 2024

నెల్లూరు: 4న జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

image

జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల 4వ తేదీన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి విజయశంకర్ రెడ్డి, రమేశ్ బాబు తెలిపారు. ఈ పోటీల్లో రాణించిన వారిని సెప్టెంబర్ 13న తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.

News August 2, 2024

నేడు నెల్లూరుకు రానున్న మంత్రి బీసీ 

image

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి ఆనంతో పాటు అధికారులతో కలిసి రామాయపట్నం పోర్టును సందర్శిస్తారు. అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటారు. పనుల పరిశీలన అనంతరం విజయవాడ బయలుదేరుతారు.

News August 2, 2024

నెల్లూరు: పింఛన్ల పంపిణీలో అలసత్వం..59మందికి నోటీసులు

image

వరికుంటపాడు మండలంలో గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శించిన 59 మంది ఉద్యోగులకు ఎంపీడీవో వెంకటకృష్ణ కుమారి నోటీసులు అందజేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు నోటీసులు అందజేశారు. ఉదయం 6 గంటలకు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ఉద్యోగులు 7 గంటలకు కూడా ప్రక్రియ ప్రారంభించకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

News August 2, 2024

గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి నారాయణ

image

నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లోని గణేష్ నిమజ్జనం ఘాట్ ను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గురువారం పరిశీలించారు. గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

News August 1, 2024

సోమశిల జలాశయానికి చేరిన కృష్ణా జలాలు

image

సోమశిల జలాశయానికి కృష్ణా జలాల తాకిడి గురువారం సాయంత్రం మొదలైంది. 2714 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ జేఈ రామ్మోహన్ రావు తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు 9.59 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా జలాల రాకతో జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.