India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ పదవి కోసం టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. గెలుపు కోసం అటు మంత్రి పొంగూరు నారాయణ, ఇటు కాకాణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి మారినట్లు సమాచారం. కాగా నెల్లూరులో మొత్తం 54 కార్పొరేటర్లు ఉండగా ఒకరు రాజీనామా చేయడంతో 53 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నెల్లూరు జిల్లాలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. నెల్లూరుకు సంబంధించి ఓసి జనరల్, కోవూరు ఎస్సీ జనరల్, కందుకూరుకు ఎస్సీ మహిళ, కావలికి బీసీ మహిళ, ఆత్మకూరు బీసీ మైనారిటీ మహిళ, ఉదయగిరి ఓసీ మహిళ, సర్వేపల్లి ఓసీ మహిళకు కేటాయించారు. దాదాపుగా అధికారికంగా కూడా ఇవే ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.
కమ్యూనిస్టు పోరాట యోధుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామం విడవలూరు(M) అలగానిపాడులో CPM పొలిట్ బ్యూరో సభ్యులు బేబీ పర్యటించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య నివాసంలో ఉన్న ఆనాటి పుస్తకాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తాను నెల్లూరులో జరుగుతున్న మహాసభలకు వచ్చానని, సుందరయ్య స్వగ్రామం చూడాలన్న కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా కో-ఆపరేటివ్ మార్కింగ్ సొసైటీ (డీసీఎంఎస్) బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్కు అందజేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో అనేకమంది వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్న క్రమంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా కేంద్ర బడ్జెట్లో మరోసారి నెల్లూరు జిల్లాకు నిరేశే ఎదురైందని పలువురు పెదవి విరుస్తున్నారు. నడుకుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్, దగదర్తి ఎయిర్ పోర్ట్, రామాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు కేంద్రం మొండి చెయ్యి చూపించారని వాపోతున్నారు. సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ పోర్ట్ల విషయంలో జిల్లాకు ఆశించిన నిధులు దక్కలేదని వామపక్షాలు సైతం ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై మీరేమంటారు.
మర్రిపాడు మండల అటవీ ప్రాంతంలో 14 చిరుతపులులు ఉన్నాయని ఆత్మకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి ఆర్.శేఖర్ తెలిపారు. మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో చిరుత రోడ్డు దాటే అంతవరకు వాహనాలు నిలిపివేసినట్లు పలువురు తెలిపారు. ఇటీవల ఓ చిరుత సింగనపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి మృతి చెందిన విషయం తెలిసిందే.
నెల్లూరు డిప్యూటీ మేయర్ TDP అభ్యర్థిగా 48వ డివిజన్ కార్పొరేటర్, ముస్లిం మైనార్టీకి చెందిన మహిళ తెహసీన్ను ఆ పార్టీ ఎంపిక చేసింది. నగరపాలక సంస్థ చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో TDP ఆమె పేరును తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెహసీన్కు అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు ఏరకంగా కూడా ఉపయోగపడే విధంగా లేదని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. శనివారం నెల్లూరులో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ జిమ్మిక్కులు చేస్తున్నదని మండిపడ్డారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికపై వారు చర్చించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎంపికపై మరికాసేపట్లో కార్పొరేటర్లతో మంత్రి సమావేశం కానున్నారు.
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ మాజీ వైస్ఛైర్మన్, 19వ డివిజన్ కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు వారు TDP తీర్థం పుచ్చుకున్నారు. మూడో తేదీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటం చర్చనీయాంశమైంది. బుచ్చి వైసీపీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.