India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో కల్లుగీత కులాల వారికి 18 మద్యం షాపు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మండలాలు, గుడ్లూరు, కలువాయి, జలదంకి, సంగం, కలిగిరి, అనంతసాగరం, వింజమూరు, దుత్తలూరు, లింగసముద్రం, దగదర్తి, ఏఎస్ పేట మండలాలకు కేటాయించారు. దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణతో పాటు రెండు లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించాలన్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెంకటాచలం మండలంలో జరిగింది. కనుపూరు గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే యువకుడు ఆదే ఊరుకి చెందిన ఓ బాలిక(16)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. అనంతరం బాలికకు టాబ్లెట్లు ఇచ్చి గర్భం తొలగింపజేశాడు. మళ్లీ లైంగిక దాడికి పాల్పడగా నిరాకరించడంతో దాడి చేశాడు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
కల్లుగీత కులాల నుంచి మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాసన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 మద్యం షాపులు కేటాయించారని ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. గౌడ -7, గౌడ్ – 6, గమళ్ల -4, గౌండ్ల -1 కేటగిరీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 80 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ కాలనీలో 25వ తేదీన మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో షాహిద్ అనే నిందితుడిని నవాబుపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ అన్వర్ బాషా మాట్లాడుతూ.. మహబూబ్ బాషా కూతురును ఇచ్చి వివాహం చేయకపోవడంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని షాహిద్ మహబూబ్ బాషాను హత్య చేసినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంటపాటు ప్రాణాలతో చిరుత కొట్టుమిట్టాడిందని పలువురు వాపోయారు. చిరుతను కాపాడేందుకు దగ్గరికి వెళ్లేందుకు వాహనదారులు సాహసం చేయలేకపోయారు.
నెల్లూరు జిల్లా చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.
Sorry, no posts matched your criteria.