India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ కాలనీలో 25వ తేదీన మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో షాహిద్ అనే నిందితుడిని నవాబుపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ అన్వర్ బాషా మాట్లాడుతూ.. మహబూబ్ బాషా కూతురును ఇచ్చి వివాహం చేయకపోవడంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని షాహిద్ మహబూబ్ బాషాను హత్య చేసినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంటపాటు ప్రాణాలతో చిరుత కొట్టుమిట్టాడిందని పలువురు వాపోయారు. చిరుతను కాపాడేందుకు దగ్గరికి వెళ్లేందుకు వాహనదారులు సాహసం చేయలేకపోయారు.
నెల్లూరు జిల్లా చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.
నెల్లూరు నగరంలోని నవాబుపేట శ్రీనివాస్ నగర్లో నిన్న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. మహబూబ్ బాషా కుమార్తె, షాహిద్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వారికి నిశ్చితార్థం చేశారు. ప్రస్తుతం షాహిద్ జులాయిగా తిరుగుతున్నాడని పెళ్లికి మహబూబ్ బాషా అంగీకరించలేదు. దీనిని మనసులో పెట్టుకున్న షాహిద్ యువతి తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత పారిపోయాడు.
76వ గణతంత్ర వేడుకలకు నెల్లూరు కలెక్టరేట్ ముస్తాబైంది. త్రివర్ణ పతాక రంగులతో అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతున్నది. గణతంత్ర వేడుకల సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గిరిజన సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, ఇతర ప్రభుత్వ శాఖల పథకాలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.
దుత్తలూరు మండలంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో బొగ్గుబట్టీలు, ఇటుక బట్టీలు, కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. కాలుష్యం నడుమ వారి ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బట్టీల వద్ద కార్మిక చట్టాలు అమలుకావటం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వాపోయారు.
Sorry, no posts matched your criteria.