India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈక్రమంలో దేవాలయాలపై దాడులు అనే అంశంలో నెల్లూరు జిల్లా దేవాలయాల్లో జరిగిన దొంగతనాలను ఆయన ప్రస్తావించారు. ‘వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీకి గురైంది. అలాగే చేజర్ల మండలం శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది’ అని చంద్రబాబు చెప్పారు.
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని ఆటోస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహన్ని గురువారం వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. గుళికలు కూల్డ్రింక్లో కలుపుకుని తాగి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మర్రిపాడు మండలం, నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ ఆలయం వద్ద గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గాయపడిన వ్యక్తి చిరివెళ్లకు చెందిన నర్సారెడ్డిగా గుర్తించారు.
జిల్లాలోని పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,990 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ PD సాంబశివారెడ్డి తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో పొదుపు సంఘాలకు రూ.1,600 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశామన్నారు. జూలై చివరినాటికి రూ.700 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు
దేశంలో 73 రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ పార్లమెంట్లో ప్రకరించారు. వీటిలో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ఉందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కలగనున్నాయి. ఇప్పటికే రూ.102కోట్లతో నెల్లూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. దీనితో పాటు గూడూరు, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి
మనుబోలు పంచాయతీ కార్యదర్శి వెంకటరమణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం మనుబోలు MPDO కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. వెంకటరమణ గతంలో మండలంలోని జట్లకొండూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా, SKR ఇంజినీరింగ్ కళాశాలకు తప్పుడు రసీదులు ఇచ్చాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జిల్లాస్థాయి అధికారులు విచారణ చేపట్టగా, అది వాస్తవమని తేలడంతో అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
నగర పాలక సంస్థ పరిధిలోని అన్నా కాంటీన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి రానున్న ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ఎంపిక చేసిన అన్నా కాంటీన్ల ప్రాంగణాలను పరిశుభ్రం చేసి, కాంటీన్ నిర్వహణకు సిద్ధం చేయాలన్నారు.
దుత్తలూరు మండల పరిధిలోని వెంకటంపేట దిగుడు అటవీ ప్రాంతంలో AP 39U2920 నంబర్ గల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడినట్లు అటువైపుగా వెళ్లేవారు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడిన పరిస్థితి చూస్తే భారీ ప్రమాదమే జరిగినట్లు తెలుస్తుందని కానీ ఘటన స్థలంలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ట్రాక్టర్ మూడుసార్లు పల్టీ కొట్టినట్లు ట్రాలీ ఒకచోట ట్రాక్టర్ మరోచోట పడిన తీరును బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సహకారశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. పీఎసీఎస్ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పీఎసీఎస్లను నాబార్డు జాతీయ సాఫ్ట్వేర్ నెట్వర్కుకు అనుసంధానం చేసిందన్నారు.
తన సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులను పక్కదారి పట్టించారని నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి పవన్ కళ్యాణ్కు గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆమె అసెంబ్లీలో పవన్ను కలిశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి సంతకం ఫోర్జరీ చేశారని చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్ పవన్ హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.