Nellore

News March 15, 2026

నెల్లూరు: మహిళా కండక్టర్‌కు HIV ఉందంటూ అవమానం!

image

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.

News March 15, 2026

నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

News March 15, 2026

నెల్లూరు: ఉదయాన్నే రామాపురం వద్ద ప్రమాదం

image

వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారిపై చింతపండు లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హిందూపూర్ నుంచి కనిగిరి వైపు చింతపండు లోడుతో వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌ దాదా పీర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News March 15, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 15, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 15, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 14, 2026

నెల్లూరులో పలు హోటల్స్ తనిఖీ.. 92 సిలిండర్లు సీజ్

image

జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్ల వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో వాడే సిలిండర్లను అక్రమంగా హోటల్స్‌లో వాడుతున్నట్లు గుర్తించారు. భారత్ గ్యాస్ 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.

News March 14, 2026

నెల్లూరు: ఇలాగైతే ప్రమాదాలు నివారించగలమా?

image

నెల్లూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి అగ్నిమాపక కేంద్రంలో 9మంది సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రమైన డబల్ యూనిట్లో 18 మందికి 10 మందే పనిచేస్తున్నారు. దీంతో ఈ శాఖ సేవలుపై ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా ఈ కొరత వేధిస్తుంది. కొన్నిచోట్ల హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. వేసవి వేళ కొరత ఇబ్బందిగా మారుతుంది.

News March 14, 2026

నెల్లూరు: ఇలాగైతే ప్రమాదాలు నివారించగలమా?

image

నెల్లూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి అగ్నిమాపక కేంద్రంలో 9మంది సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రమైన డబల్ యూనిట్లో 18 మందికి 10 మందే పనిచేస్తున్నారు. దీంతో ఈ శాఖ సేవలుపై ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా ఈ కొరత వేధిస్తుంది. కొన్నిచోట్ల హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. వేసవి వేళ కొరత ఇబ్బందిగా మారుతుంది.

News March 14, 2026

నెల్లూరు: ఇలాగైతే ప్రమాదాలు నివారించగలమా?

image

నెల్లూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి అగ్నిమాపక కేంద్రంలో 9మంది సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రమైన డబల్ యూనిట్లో 18 మందికి 10 మందే పనిచేస్తున్నారు. దీంతో ఈ శాఖ సేవలుపై ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా ఈ కొరత వేధిస్తుంది. కొన్నిచోట్ల హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. వేసవి వేళ కొరత ఇబ్బందిగా మారుతుంది.