India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎండనక, వాననక తమ రక్తాన్ని చెమటగా మార్చి రైతన్నలు పంటలు పండిస్తారు. మార్కెట్లో పంట అమ్ముకునే సమయంలో కొంతమంది దళారుల మాయ మాటలు నమ్మి మోసపోతారు. నగదు త్వరగా చెల్లిస్తామని నమ్మబలికి పంటలను కొనుగోలు చేసే దళారులు రైతులను నట్టేట ముంచిన ఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు.

యుద్ధం ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ, గుడ్లు ఎగుమతులు పడిపోయాయి. దీంతో వాటి ధరలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా నెల్లూరులో శనివారం బాయిలర్ కోడి ధర రూ.175 పలికింది. స్కిన్తో కూడిన కేజీ చికెన్ రూ.304, స్కిన్ లెస్ రూ.334గా ఉంది. డిసెంబర్, జనవరిలో కోళ్లకు వైరస్ వచ్చి చనిపోవడంతో ధరలు పెరిగాయని.. రంజాన్కు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.
Sorry, no posts matched your criteria.