Nellore

News March 12, 2026

నెల్లూరు: నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోతుంది..!

image

నెల్లూరు జిల్లాలో గ్లకోమా(నీటి కాసుల) బాధితుల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు పెద్దాసుపత్రికి పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారు. 2020లో 250 కేసులు, 2021లో 400, 2022లో 440, 2023లో 500, 2024లో 567, 2025లో 600 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని అలసత్వం చేస్తే.. శాశ్వత అంధకారం నెలకొంటుందని GGH కంటి డాక్టర్ వసంత తెలిపారు. మీకూ ఈ సమస్య ఉంటే వెంటనే చెక్ చేసుకోండి.

News March 12, 2026

నెల్లూరు: హాల్ టికెట్లకు పూజలు

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేలా అనుగ్రహించాలని కోరుతూ విద్యార్థులు జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి పూజలు చేశారు. బుచ్చి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆలయంలో హాల్ టికెట్లకు పూజలు చేయించుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పూజలు చేయిస్తున్నారు.

News March 12, 2026

నెల్లూరు: ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్!

image

ఉదయగిరి MLAగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. 1994, 99లో కంభం విజయరామిరెడ్డి, 2014లో బొల్లినేని విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలోని జలదంకికి చెందిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి నుంచి గెలిచారు. వీరంతా గత ఎన్నికల్లో TDP కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల అనుచరులకు కీలక పదవులు లభించలేదు. తమకు సైతం ప్రాధాన్యం లేదంటూ ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్‌గా ఉంటున్నారని టాక్.

News March 12, 2026

నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News March 12, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News March 11, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News March 11, 2026

NLR: సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. వాస్తవం ఇదే.!

image

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని సంబంధిత శాఖ అధికారిని లీలారాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అధీకృత LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిలిండర్ల కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News March 11, 2026

నెల్లూరు: 9వ తరగతి విద్యార్థులకు గమనిక

image

ఇస్రో ఆధ్వర్యంలో జరగనున్న యువిక-2026 ఉచిత శిక్షణకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో 9th విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా www.isro.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపించాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన సెలక్ట్ చేసిన విద్యార్థులు మే 11 – 22 తేదీ వరకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

రైల్వే బిట్రగుంట గురించి మీకు తెలుసా…?

image

రైల్వే బిట్రగుంట చాలామందికి తెలుసు. దేశంలోనే పేరు పొందిన లోకో షెడ్ ఇక్కడుండేది. వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. దీన్నే లిటిల్ ఇంగ్లాండనేవారు. రైల్వే కంటోన్మెంటనీ పిలిచేవారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల రాకతో లోకో షెడ్ అవసరం తీరింది. సహజంగానే మూతపడింది. రైల్వే షెడ్‌తో ప్రఖ్యాతి పొందిన రైల్వే బిట్రగుంట ఇప్పుడు అజ్ఞాతంగా ఉంది. వందల కోట్లు ఆస్తులు ఉన్నా.. ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తోంది.

News March 11, 2026

నెల్లూరులో 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా

image

నెల్లూరు జిల్లాలో పంచాయతీలకు గ్రేడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాటిలో జనాభా ప్రాతిపదికన 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా లభించింది. అల్లూరు, బోగోలు, కోట, కోవూరులో 2 పంచాయతీలు, ముత్తుకూరులో 2 పంచాయతీలు, పొదలకూరు, రాపూరు, సంగం, ఉదయగిరి, వింజమూరు, కలువాయి పంచాయతీలు ఉన్నాయి. ఇక మీదట ఈ పంచాయతీల్లో మున్సిపాలిటీ తరహాలోనే పాలన కొనసాగనుంది.